నందమూరి బాలకృష్ణ.. పౌరుషనటనకు మారుపేరుగా నిలచిన బాలకృష్ణ ఇప్పుడు రౌద్రానికి బ్రాండ్ అంబాసిడర్ అవుతున్నారన్న విమర్శలు వస్తున్నాయి.  బాలకృష్ణ అభిమానులుపై చేయి చేసుకోవడం.. బూతులు తిట్టడం  సర్వసాధారణంగా మారింది. ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి. 


ఇటీవలే బాలకృష్ణ మరోసారి విజయనగరం జిల్లా చీపురుపల్లిలో ఓ అభిమానిని పరుగెత్తించి మరీ కుమ్మేశాడు. విజయనగరంలో జిల్లాలోనే మరో ఘటనలో తనను ఫోటో తీస్తున్న ఓ అభిమాని చేతి నుంచి సెల్ ఫోన్ లాక్కుని.. తనదైన స్టైల్లో నోటికి పని చెప్పాడు. అంతకుముందూ ఇలాంటి
ఘటనలు బోలెడు ఉన్నాయి. 

అయితే.. బాలయ్య ఇంతగా ఎందుకు ఫ్రస్టేషన్‌ కు గురవుతున్నారు..అన్న విషయం పరిశీలిస్తే.. ఇటీవల విడుదలైన ఎన్టీఆర్ జీవిత చరిత్రలు ఎన్టీఆర్ మహానాయకుడు, కథానాయకుడు రెండూ అట్టర్ ఫ్లాప్ కావడమే కారణంగా తెలుస్తోంది. ఈ సినిమాల కారణంగా పరువు పోయింది. 

దీనికి తోడూ ఈ రెండు సినిమాలకూ తనే నిర్మాత కావడం వల్ల ఆర్థికంగా బాగా నష్టపోయారు. మరోవైపు దీనికి పోటీగా వస్తున్న లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా విడుదలను అడ్డుకోలేకపోవండ కూడా ఓ కారణంగా కనిపిస్తోంది. అసలే కాస్త కోపం ఎక్కువ.. అందులో ఇలాంటి చిరాకులు ఉంటే బాలయ్యకు కోపం రావడం సహజమేగా అంటున్నారు ఆయన అనుచరులు.


మరింత సమాచారం తెలుసుకోండి: