ఆంధ్రజ్యోతి ఛానల్ ఎండీ రాధాకృష్ణ- చంద్రబాబుల పిచ్చాపాటీ సంభాషణ వీడియో ఒకటి ఈ మధ్య బాగా వైరల్ అయ్యింది. అందులో ఎన్టీఆర్ ను వాడు అన్నాడని సాక్షి పత్రిక బాగా హైలెట్ చేసింది. దానికి టీడీపీ వివరణ కూడా ఇచ్చుకుంది. ఈ గొడవ చల్లారక ముందే మరో వీడియో బయటికొచ్చింది. 


ఈ వీడయోలు రాధాకృష్ణ ప్రభుత్వ ఉద్యోగులను.. ఆ.. నాకొడుకులు.. అంటూ చీత్కారంగా మాట్లాడటం కలకలం రేపుతోంది..  సాక్షి పత్రిక కథనం ప్రకారం ఆ వీడియోలో ఏముందంటే.. 

చంద్రబాబు – రాధాకృష్ణ  సమావేశమై వివిధ అంశాలపై చర్చించుకున్నారు. తమకు కల్పించాల్సిన ప్రయోజనాల గురించిన ఉద్యోగుల డిమాండ్‌ ప్రస్తావనకు రాగానే రాధాకృష్ణ బూతు పురాణం లంకించుకున్నారు.

ముఖ్యమంత్రి: ఉద్యోగులకు సెంట్రల్‌ పీఆర్సీ ఇస్తామని చెప్పాంగానీ....

రాధాకృష్ణ: ఏందీ?  ఉద్యోగులకు సెంట్రల్‌ పీఆర్సీనా? మీరందరూ కలిసి రాష్ట్రాన్ని ఎక్కడకు తీసుకెళదామనుకుంటున్నారు ? నాన్‌ ప్లాన్‌ (ప్రణాళికేతర వ్యయం) ఇప్పటికే తడిసి మోపెడవుతోంది. గవర్నమెంట్‌ ఆఫ్‌ ఇండియా అంతే. ఇదీ అంతే. రెండూ ఒకటే.  ఆ నా కొడుకులకు (ఉద్యోగులకు) జీతాలివ్వడానికా? జనం ట్యాక్స్‌లు కట్టేది. అది వద్దు. వద్దే వద్దు తీసేయండి. 

సీఎం: అదేం కాదు. వాళ్లను కూడా లాగాలి కదా? 

రాధాకృష్ణ: సరే అది మీ ఇష్టమనుకోండి. అది వేరే విషయం.

సీఎం: కాదు కాదు. నేను చెబుతాను వింటావా? మీరు చెప్పినవన్నీ కరెక్టు. కానీ అధికారం లేకపోతే మనమేమీ చేయలేం.  దాని కోసం... ఇంట్రెస్టింగ్‌  అంశం చెబుతా.  నేను ఎప్పుడూ ప్రజలకు డబ్బులు ఇచ్చేవాడిని కాదు. ఇది నా వ్యక్తిత్వానికి విరుద్ధం. కానీ ఇవ్వకపోతే చేతకానివాణ్ని అనుకుంటారు. ఇటీవల కాలంలో ఏమి చేశానంటే బిగినింగ్‌లో మరీ డిజాస్టర్స్‌గా ఉన్నప్పుడు పది వేలిచ్చాను. చూస్తే నాదగ్గర అంత ఉండదు. మార్చుకున్నా  5 వేలిచ్చా. అంత కూడా  ఉండదు. దీంతో రూ. 2,000 ఒక ఇది చేసి 1,300 మందికి ఇచ్చా. వాళ్లను చూసినప్పుడు భయంకరమైన పరిస్థితి.  నేనేమంటానంటే బిగినింగ్‌ లో నాలాంటి వాడు కాస్త లిబరల్‌గా కనబడకపోతే చాలా ప్రాబ్లమ్స్‌ వస్తాయి. లిబరల్‌గా వచ్చిన తర్వాత మేనేజ్‌ చేయడం , ఎడ్యుకేట్‌ చేయడం ఈజీగా వచ్చేస్తాయి. దటీజ్‌ వేర్‌ అయాం సేయింగ్‌..



మరింత సమాచారం తెలుసుకోండి: