ఎన్నికల ముందు రోజు కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. కొన్ని చోట్ల అధికారులను బెదిరిస్తూ ఓటర్లను భయభ్రాంతులకు గురి చేస్తుంటే మరోపక్క ఏ నియోజకవర్గానికి సంబంధించిన ఆ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు గ్రామాలలో ఉన్న సామాన్య ప్రజలను బెదిరింపులకు గురి చేస్తూ తెలుగుదేశం పార్టీకి ఓటు వేయకపోతే చాలా తీవ్ర పరిణామాలు ఉంటాయని వార్నింగ్లు ఇస్తున్నారు.


ఇదే క్రమంలో అనంతపురం జిల్లా రాజకీయాలలో కీలకంగా ఉండే జేసీ దివాకర్ రెడ్డి తనయుడు పవన్ కుమార్ మొట్టమొదటిసారి ప్రజాక్షేత్రంలో పోటీకి దిగిన నేపథ్యంలో తండ్రి జేసీ దివాకర్ రెడ్డి అనంతపురం జిల్లాలో ఉన్న గ్రామాలలో ప్రజలకు తన కుమారుడికి ఓటు వేయకపోతే మీ అంతు చూస్తాను అంటూ వార్నింగ్ లు ఇస్తున్నారు. దీంతో జేసి దివాకర్ రెడ్డి వ్యవహరిస్తున్న శైలిపై అనంతపురం జిల్లాలో ఉన్న గ్రామస్తులు మండిపడుతున్నారు.


ఓటు కూడా ఎవరికి వేయాలో మీరే చెబుతారా అంటూ తెలుగుదేశం పార్టీ నాయకుల వ్యవహారశైలిపై మండిపడుతున్నారు.  మరోపక్క జేసీ దివాకర్ రెడ్డి తన కుమారుడు పవన్ ఎలాగైనా మొట్టమొదటిసారి గెలిపించుకోవాలని తెగ ఆరాటపడుతున్నారు. మొత్తంమీద ఎన్నికల ముందు రోజు జెసి దివాకర్ రెడ్డి అనంతపురం జిల్లా గ్రామాల లో హల్ చల్ చేయడంతో ఈ వార్త ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ఇది హాట్ టాపిక్ అయింది.



మరింత సమాచారం తెలుసుకోండి: