తెలుగు రాష్ట్రాల్లో రేపు ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో తమ తమ ఊళ్లకు వెళ్లి ఓటు వేసే క్రమంలో ప్రజలు ప్రయాణాల్లో నానా అవస్థలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో స్థిరపడిన ఏపీ వాసులంతా.. సొంతూళ్లకు పయనమయ్యారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ వాసులతో టోల్ ప్లాజాల వద్ద వాహనాలు కిలోమీటర్ల కొద్దీ బారులు తీరడంతో, ఈ ఉదయం తీవ్ర ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. 

ఏపీ వైపు వెళ్లే రహదారులపై ఎక్కడ చూసినా కూడా వాహనాలే కనిపిస్తున్నాయి. యాదాద్రి జిల్లాలోని చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ ప్లాజా దగ్గర ట్రాఫిక్ జామైంది. కిలోమీటర్ మేర వాహనాలు నిలిచిపోయాయి. 

రద్దీ ఎక్కువగా ఉన్న వేళ, టోల్ వసూలు వద్దంటూ టోల్ ప్లాజా నిర్వాహకులతో వాగ్వాదానికి దిగిన ప్రయాణికులు, గేట్లను ధ్వంసం చేశారు. అప్పటికే గంటల సమయం వేచివున్న ప్రయాణికులు ఒక్కసారిగా గేట్లను ధ్వంసం చేయడంతో, అక్కడున్న సిబ్బంది ఎవరూ వారిని అడ్డుకోలేని పరిస్థితి ఏర్పడింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: