నారాయణపేట్ జిల్లా మరికల్ మండలంలోని తీలేరులో నేటి ఉదయం తీలేరు గ్రామానికి చెందిన ఉపాధి కూలీలు గ్రామ సమీపంలోని మట్టి పనికి వెళ్లారు. అక్కడే మట్టిని తోవుతున్న క్రమంలో  మట్టి పెళ్లలు ఉన్నట్టుండి మీద పడటంతో ఎనిమింది మంది ఉపాది కూలీలు అక్కడిక్కడే మృతి చెందారు.
మరికొంత మంది ఉపాది కూలీలు మట్టి పెళ్లల కిందే ఉన్నారు. 

క్షత గాత్రులను దగ్గరలోని ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేస్తున్నారు.  సంఘటన జరిగిన ప్రాంతంలో సుమారు 15 మంది పనిచేస్తున్నట్టుగా కూలీలు చెబుతున్నారు.  మృతి చెందిన వారి బంధువుల ఆర్తనాదాలతో హృదయవిదారకంగా ఉంది అక్కడి పరిస్థితి.  అయితే మృతులు ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: