హాట్ సీట్లు అనగానే ఆ హీటే వేరబ్బా అన్నట్లుగా ఉంటుంది. నువ్వా నేనా అన్న వాటినే అలా  చూస్తారు. ఆ విధంగా తాడో పేడో తేచుకునే సీట్లు, నరాలు తెగిపోయే సస్పెన్స్ పెట్టే సీట్లు ఏపీలో చాలానే ఉన్నాయి. అందులో ఉత్తరాంధ్రలో తీసుకుంటే ఓ పది వరకూ ఉంటాయి. విశాఖలో నాలుగైదు అలాంటివి ఉన్నాయి.


వాటిలో గెలుపు ఎవరిది అన్న దానిపై అనధికారికంగా పందేలు జరుగుతున్నట్లుగా ప్రచారం సాగుతోంది. విశాఖ ఉత్తరం, గాజువాక, భీమునిపట్నం, పెందుర్తి సీట్లో ఎవరు విఏజేత అన్న దాని మీద గట్టిగానే పందేలు కాస్తున్నారని అంటున్నారు. లక్షల మీదనే ఈ పందేలు ఉన్నాయని భోగట్టా.


ఈ సీట్లు అక్కడ పోటీలో ఉన్న వారికి చాలా ప్రతిష్టాత్మకమైనవి. పొరపాటున తేడా కొడితే ఏకంగా రాజకీయ భవిష్యత్తు శూన్యం అవుతుంది. అందువల్ల చావో రేవో అన్నట్లుగా ప్రచారం జరిగింది. ఆ తరువాత పోల్ మేనేజ్మెంట్ కూడా జాగ్రత్తగా చేసుకుంటున్నారు. గెలుస్తామని అంతా చెబుతున్నా ఫలితం వచ్చేవరకూ ఎవరన్నది చెప్పలేని పరిస్తితి ఉంది. దాంతో పందేలు జోరందుకున్నాయి. మరి గెలుపు ఒకరిదే అవుతుంది. అపుడు ఓడిన వారితో పాటు పందెం రాయుళ్ళు కూడా కొంగు కప్పుకోవాల్సిందే మరి.


మరింత సమాచారం తెలుసుకోండి: