ఎన్నికలకంటే పెద్ద పరీక్షలేముంటాయి రాజకీయ పార్టీలకు-నాయకులకు? అందులోనూ ఈసారి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు ఇండియా - పాకిస్థాన్ లు వందమాచ్ లు ఆడినంత ఉత్సుకత రేకెత్తిస్తున్నాయి.
వీటి గురించి బ్రహ్మాండమయిన ఉపమానం చెప్పారు వైసీపీ మచిలీపట్న అభ్యర్థి బాలశౌరి. ఆయనేమన్నారంటే.. రేపు ఎన్నికల పరీక్షలు.. మూడు వేలకు పైగా కిలో మీటర్ల పాదయాత్ర చేసి జనాల కష్టాలు తెలుసుకున్న అవగాహనతో..వారికి మంచి చేయాలన్న ఆశయంతో జగన్ ఏ ఇన్విజిలేటరు వచ్చినా నేను పరీక్షకు తయారు అంటున్నారు. మరోపక్క చంద్రబాబు అస్సలు ఇన్విజిలేటరే వద్దంటున్నారు అని ముగించారు.
ప్రజలు విజ్ఞులు, ఓటర్లు తెలివైన వారు, ఎవరికి అధికారం ఇవ్వాలో, ఎవరిని సాగనంపాలో వారికి బాగా తెలుసు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.