ఎప్పటికప్పుడు సంచలన వ్యాఖ్యలు చేస్తున్న కే.ఏ పాల్ మళ్లీ తనదైన శైలిలో సరిగ్గా పోలింగ్ కి ముందు కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఓటర్లు అందరినీ ఉద్దేశించి అతను చేసిన వీడియో ఇప్పుడు ఇంటర్నెట్ లో చక్కర్లు కొడుతోంది. మొత్తం 46 అసెంబ్లీ స్థానాలు మరియు 7 పార్లమెంటు స్థానాల్లో తన ప్రజాశాంతి పార్టీ పోటీ చేస్తుంది అని ఈ సందర్భంగా చెప్పారు.

అయితే అతను అందరికీ తమ పార్టీ పోటీ చేయని స్థానాల్లో అసలు ఓటు ఎవరికీ వేయవద్దు అని చెప్పడం ఇక్కడ విశేషం. అతని పార్టీ పోటీ చేస్తున్న స్థానాలు మినహాయించి మిగతా స్థానాల్లో ఉన్న ప్రజలను ఇళ్ళల్లో కూర్చోమని లేదా అవసరమైతే నోటా వేయమని ఆయన అన్నారు. ఇంకా కొన్ని నియోజకవర్గాల్లో తమ పార్టీ అభ్యర్థులను ఇండిపెండెంట్ లుగా గుర్తించి వారికి ఏవేవో గుర్తుకు ఇచ్చారని దాని పై అతను తరువాత పోరాడతానని అన్నారు.

ఇక పోతే సైకిల్, ఫ్యాన్ మరియు గ్లాసు గుర్తుకు ఓటు వేసి మళ్లీ తప్పు చేయవద్దని ఆయన అన్నాడు. క్రిమినల్ అయిన జగన్ కి, అయిదేళ్ళు మాయమాటలు చెప్పిన బాబు మరియు నిజ జీవితంలోనూ నటించే పవన్ కు ఓటు వేస్తే ఒరిగేది ఏమీ లేదని, యుక్తితో ఆలోచించి హెలికాప్టర్ గుర్తుకు వేయమని కే ఏ పాల్ అన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: