ఆంధ్రప్రదేశ్ లో నిన్నటి వరకు ఎంతో ఉత్కంఠంగా ఎదురు చూసిన పోలింగ్ తేది రానే వచ్చింది.  సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు.  కొంత మంది ఓటు గల్లంతుతో నిరాశలో ఉన్నారు.  సినీ, రాజకీయ నేతలు తమ ఓటు వినియోగించుకోవడానికి క్యూ లైన్లో నిలబడుతున్నారు. 


తాజాగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు  వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆయన సతీమణి భారతి  కడప జిల్లాలోని పులివెందులలో తన ఓటుహక్కును వినియోగించుకున్నారు.  నియోజకవర్గంలోని భాకరాంపురం ఎంపీపీఎస్ స్కూల్ భవనంలో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్‌లో జగన్ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.  


ఈ సందర్భంగా జగన్  మాట్లాడుతూ సమాజంలో మార్పు రావాలంటే ప్రతి ఒక్కరూ నిర్భయంగా ఓటు వేయాలన్నారు. ఈసారి ఓట్లర్లు రాష్ట్ర అభివృద్ది కాంక్షించే వారికే ప్రాధాన్యత ఇవ్వాలని చూస్తున్నారని.. రాష్ట్ర ప్రజలు మార్పుకోరుకుంటున్నారని, దేవుని దయవల్ల రాష్ట్రంలో మార్పు వస్తుందని ఆశిస్తున్నాని ఆయన అన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: