చంద్రబాబు మాట్లాడితే తానే టెక్నాలజీ కనిపెట్టానని చెబుతారు. తానే కంప్యూటర్ విప్లవం తెచ్చానని, తనే దేశంలో సాంకేతిక సంస్కరణలకు నాంది పలికానని కూడా చెబుతారు. ఈ రోజు ప్రతి వారి చేతిలో స్మార్ట్  ఫోన్లు ఉన్నాయంటే అది తన ఘనతగా బాబు  గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు. ఇందులో నిజమెంత వుందో తెలియదు కానీ బాబు మాత్రం తొణక్కుండా బెణక్కుండా భారీ స్టేట్మెంట్స్ ఇచ్చేస్తారు.

 


ఇక తెల్లారుతూనే పోలింగ్ వేళ హై టెక్ బాబు సీన్ రివర్స్ చేశారు. హైటెక్ వద్దు, ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటున్నారు చంద్రబాబు. ఈవీఎం ల వల్ల అన్నీ అనర్ధాలే, నేను వద్దన్నా వినకుండా పెట్టారంటూ బాబు మొత్తుకున్నారు. అభివృద్ధి చెందిన దేశాలు, టెక్నాలజీ ఎక్కువగా ఉన్న దేశాలు కూడా ఈవీఎంలను వాడటం లేదని, మన వద్ద ఈవీఎంల ద్వారా ఓటింగ్ ఎందుకని  చంద్రబాబు నాయుడు అనడం విడ్డూరం.

 

ఈ రోజు ఆయన  కుటుంబసభ్యులతో కలిసి ఉండవల్లిలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… పేపర్ మీద ఓటు వేసిన సంతృప్తి ఈవీఎంలలో వేస్తే రాదన్నారు. ఈవీఎంల ద్వారా సాంకేతిక సమస్యలతో పాటు మ్యానిపులేషన్ చేసే అవకాశం ఉందన్నారు. అందుకే ఈవీఎంలు వద్దని తాను ముందునుంచీ ప్రయత్నిస్తున్నానని పేర్కొన్నారు.

 

ఇవాళ కూడా ఈవీఎంలు సరిగ్గా పనిచేయడం లేదన్నారు. ఈవీఎంల ద్వారా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని అన్నారు. బ్యాలెట్ పద్ధతిలోనే ఓటింగ్ జరిగేలా సుప్రీం కోర్టులో రివ్యూ పిటీషన్ వేస్తామన్నారు. ఈవీఎంల ద్వారా ప్రజాస్వామ్యంతో ఆడుకుంటున్నారని ఆరోపించారు.

 


మరింత సమాచారం తెలుసుకోండి: