ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా చోట్ల ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరుగుతుండగా కొన్నిచోట్ల అధికార పార్టీ టిడిపి కి చెందిన నాయకులు కార్యకర్తలు ఓటర్లు భయబ్రాంతులకు గురి అయ్యే టట్లు దాడులకు తెగబడుతున్న దృశ్యాలు మీడియాలో సోషల్ మీడియాలో రావడంతో టి.డి.పి ఓటమి ఖాయమని ఆ పార్టీ కి తెలిసిపోయిందని ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను బట్టి అర్థమవుతోందని కొంత మంది ఓటర్లు టిడిపి చేస్తున్న దాడుల గురించి కామెంట్లు చేస్తున్నారు.


ఇదిలా ఉండగా ఏపీ మీడియాలో ఎపి స్పీకర్ కోడెల శివప్రసాదరావు చేసిన హడావుడిపై పలు కథనాలు వస్తున్నాయి. తెలుగుదేశం మీడియా కోడెలపై వైఎస్ ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలు దౌర్జన్యం చేశారని ప్రచారం చేస్తుంటే, పోలింగ్ స్టేషన్ లో కోడెల హల్ చల్ చేశారని మరికొన్ని చానళ్లలో వార్తలు వచ్చాయి.


గుంటూరు జిల్లా ఇలిమెట్ల గ్రామంలో ఈ ఘటన జరిగింది. పోలింగ్ బూత్ లో కి కెడెల వెళ్లి తలుపు వేసుకుని భైటాయించారని ఎన్.టి.వి .లో వార్త చెబుతోంది. దాంతో పోలీసులు ఆయనను బలవంతంగా బయటకు తీసుకు వచ్చారు. బయటకు తీసుకు వస్తుండగా కోడెల సొమ్మసిల్లి పడిపోయారని కొన్ని చానళ్లు చెబుతుండగా, డ్రామాకు తెరలేపాడని మరికొన్ని ప్రచారం చేస్తున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: