2014 ఎన్నికల నాటికి ఆంధ్రప్రదేశ్ లో ఓటర్ల సంఖ్య 3.68 కోట్ల మంది, 2019 ఈ ఎన్నికల నాటికి ఆంధ్రప్రదేశ్ ఓటర్ల సంఖ్య దాదాపు నాలుగు కోట్లకు చేరింది. 


3.68 కోట్ల మంది ఓటర్లతో 2014 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల పోలింగ్ శాతం మొత్తం కలిపినా 76.80% మాత్రమే.

అదే 2019 ఈ ఎన్నికల్లో ఉదయం తెదెపా అనుకూల మీడియా ఛానెళ్ళలో చూపిస్తున్నట్లుగా 30% ఈవీఎంలు పనిచేయకపోయి ఉంటే దాదాపు నాలుగు కోట్ల మంది ఓటర్లు ఉన్నా 2014 లో నమోదయిన 76.8% కన్నా ఎక్కువగా ఓట్లు ఎలా పోలవుతాయి? సాయంత్రం 5 గంటలకే 66% పైగా ఓటింగ్ ఎలా అవుతుంది?


జిమ్మిక్కులు, గిమ్మిక్కులు ఎన్ని చేసినా, ఏం చూపించినా, ఎంత మీడియా భయపెట్టినా, ఆందోళనలు, ఆగ్రహాలు, ధర్నాలు, లేఖలు ఇచ్చినా కూడా..దాదాపు నాలుగు కోట్ల ఆంధ్ర ఓటర్లు విస్పష్టమయిన తమ తీర్పును ఇంతకు ముందెన్నడూ లేనంత రికార్డు పోలింగ్ శాతంతో ఈవీఎంలో నమెదు చేస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: