తెలంగాణలో పోలింగ్ ప్రశాంతంగా, సాఫీగా సాగింది. పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన తర్వాత రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్  మీడియాతో మాట్లాడుతూ 17 నియోజకవర్గాల్లో ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయన్నారు. 5 గంటల వరకు 17 నియోజకవర్గాల్లో నమోదైన పోలింగ్ శాతం వివరాలను రజత్ కుమార్ మీడియాకు తెలిపారు. కాగా, తెలంగాణ రాష్ట్రంలోని 17 నియోజకవర్గాల్లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో ఓటింగ్ శాతం సికింద్రాబాద్‌లో దారుణంగా పడిపోగా ఆ తర్వాతి స్థానంలో హైదరాబాద్ నిలిచింది.

 


మొదటి స్థానంలో మెదక్ నిలిచింది. మెదక్‌లో మాత్రం 68.60 శాతం ఓటింగ్ నమోదైంది. ఆ తర్వాతి స్థానంలో భువనగిరి 68.25 శాతంతో రెండో స్థానంలో ఉంది. ఏప్రిల్ 11న నమోదైన పోలింగ్ వివరాలను బట్టి మిగిలిన నియోజకర్గాల్లో వివరాలిలా ఉన్నాయి. హైదరాబాద్ సిటీలో పోలింగ్ శాతం భారీగా పడిపోయింది. కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్, శేరిలింగంపల్లి ప్రాంతాల్లో నమోదైన ఓటింగ్ మరింత దారుణంగా కనిపించింది.

 

 


మెదక్ 68.60

భువనగిరి 68.25

కరీంనగర్ 68

ఖమ్మం 67.96

జహీరాబాద్ 67. 80

ఆదిలాబాద్ 66.76

పెద్దపల్లి 59.24

నిజామాబాద్ 54.20

మల్కాజ్‌గిరి 42.75

సికింద్రాబాద్ 39.20

హైదరాబాద్ 39. 49

చేవెళ్ల 53.80

మహబూబ్‌నగర్ 64.99

నాగర్ కర్నూల్ 57. 12

నల్గొండ్ 66.11

వరంగల్ 60

మహబూబాబాద్ 59.90

 


మరింత సమాచారం తెలుసుకోండి: