అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపుపై వైసీపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. 110 నుంచి 130 సీట్లు గెలుస్తామని చెబుతున్నారు. ఒక్కో నేత ఒక్కో విధంగా అంచనాలు వేస్తున్నారు. చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ మాత్రం తాము సెంచరీ దాటిస్తామని పక్కాగా చెబుతున్నారు. 


తనను అసెంబ్లీకి రానివ్వబోనంటూ ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు చెప్పడంపై ఆయన స్పందించారు. చంద్రబాబు నాయుడు తనను అసెంబ్లీకి రానివ్వనని అంటున్నారన్న ప్రశ్నకు సమాదానం ఇస్తూ నేను అసెంబ్లీకి వెళితే చంద్రబాబు వెనుక డోర్ నుంచి వెళ్లిపోతారా అని ఎద్దేవ చేశారు. తాను గెలవబోతున్నానని ఆయన అన్నారు. 

మంగళగిరిలో లోకేష్ కూడా ఓడిపోవచ్చని కూడా ఆమంచి లెక్కలు వేస్తున్నారు. చంద్రబాబు మీద ప్రజలలో తీవ్ర వ్యతిరేకత ఏర్పడిందని,ఈయన బెడదను వదలించుకోవాలని చదువుకున్నవారు, యువకులు పెద్ద ఎత్తున ఓట్లు వేశారని కృష్ణమోహన్ అన్నారు.

వైసీపీ కనీసం 110 సీట్లు గెలుచుకోబోతోందని ఆమంచి అంటున్నారు.  జగన్ ముఖ్యమంత్రి కాబోతోందని ఆయన అన్నారు. పోలీసులను వెంటబెట్టుకుని పులి వేషం వేసుకుని చంద్రబాబు తిరిగారని ,అయినా ఫలితం వారికి అనుకూలంగా లేదని ఆయన అన్నారు. ఇదీ వైసీపీ నేతల ధీమా..



మరింత సమాచారం తెలుసుకోండి: