వరుస ఎన్నికల పరంపరకు వేదికగా ఉన్న తెలంగాణలో మరో ఎన్నికల సందడి తెరమీదకు రానుంది. ముందస్తు ఎన్నికలు, అనంతరం పంచాయతీ పోరు...ఆ తదుపరి పార్లమెంటు ఎన్నికలతో సందడిగా కొనసాగిన తెలంగాణ గడ్డపై మరో ఎన్నికకు రంగం సిద్ధమైంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఓకే అనడంతో ఎన్నికల ప్రక్రియ మొదలుకానుంది.


జిల్లా, మండల పరిషత్‌ , మున్సిపల్‌‌‌‌ ఎన్నికలను నిర్వహించేందుకు తెలంగాణలో అడుగులు పడుతున్నాయి. పదేపదే తెరమీదకు వస్తున్న ఎన్నికల కోడ్కు పరిష్కారంగా ఈ ఎన్నికలకు సన్నద్ధం అవుతున్నారు. గత ఏడాది సెప్టెంబర్‌‌‌‌ 6 నుంచి రాష్ట్రం లో అసెంబ్లీ ఎన్నికల కోడ్, అనంతరం పంచాయతీ ఎన్నికల కోడ్, ఇప్పుడు లోక్ సభ ఎన్నికల కోడ్ .. ఇలా వరుసగా కోడ్లు వస్తూనే ఉన్నాయి. కోడ్ వల్ల పాలనపరమైన కీలక నిర్ణయాలు తీసుకోవడానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయని, లోక్ సభ ఎన్నికల కోడ్ ముగిసే లోపు రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి చేయాలని ప్రభుత్వం రాష్ట్ర ఎన్నికల కమిషన్‌‌‌‌ను కోరింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌‌‌‌ జిల్లా, మండల పరిషత్‌ ఎన్నికలు మే 20లోగా పూర్తిచేసేందుకు అనుమతినివ్వాలని కోరుతూ మార్చి13, 22 తేదీల్లో కేంద్ర ప్రధాన ఎన్ని కల కమిషనర్‌‌‌‌కు లేఖ రాసింది. పరిషత్‌ ఎన్నికలకు సీఈసీ అనుమతినిచ్చింది.


పరిషత్ ఎన్నికలకు ఈసీ గ్రీన్‌‌‌‌ సిగ్నల్‌‌‌‌ ఇవ్వగా.. మున్సిపల్‌‌‌‌ ఎన్నికలకు త్వరలోనే అనుమతి ఇచ్చే అవకాశం ఉంది. ఈ నెల 13, 14 తేదీల్లో జిల్లా, మండలప రిషత్‌ ఎన్నికల రిటర్నింగ్‌‌‌‌ అధికారులకు రాష్ట్ర ఎన్నికల సంఘం శిక్షణ ఇవ్వనుంది. ఈ నెల 15న రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులతో ఎన్నికల కమిషనర్‌‌‌‌ నాగిరెడ్డి సమావేశం కానున్నారు. 18న కలెక్టర్లు,ఎస్పీలతో సమావేశం కావాలని ఇప్పటికే నిర్ణయించారు. జిల్లా ఉన్నతాధికారులతో సమావేశంలో ఎన్నికల తేదీలపై స్పష్టత వచ్చే అవకాశముంది. మూడు విడతల్లో రాష్ట్రంలో 32 జిల్లా పరిషత్‌ లు, 535 మండల పరిషత్‌లకు ఎన్నికలు నిర్వహించనున్నారు. వారం రోజుల్లోగా షెడ్యూల్‌‌‌‌ విడుదల చేసి ఈనెల 23న తొలి విడత పోలింగ్‌‌‌‌కు నోటిఫికేషన్‌‌‌‌ విడుదల చేసే అవకాశమున్నట్టు సమాచారం.


మరింత సమాచారం తెలుసుకోండి: