వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డికి ఆయన ఎన్నికల ప్రణాలిక రచయిత నిర్దేశకుడు ప్రచార సారధి ప్రశాంత్ కిశోర్ నేడు ఒక కీలక సూచన చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఎన్నికల్లో జగన్మోహనరెడ్డికి సారధ్యంలోని వైసీపీ గెలవడం ఖాయమని ప్రశాంత్ కిశోర్ తన ధృఢమైన ఆత్మ విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.


ఏపిలో శాసన సభల అభ్యర్ధుల ఎన్నికల ప్రక్రియ ముగిసిన తర్వాత వైఎస్ జగన్మోహనరెడ్డి, తన పార్టీకి మార్గనిర్దేశకుడైన ప్రశాంత్ కిశోర్ సారధ్యంలో పనిచేస్తున్న ఐప్యాక్ ఆఫీసుకు వెళ్లారు. 
Image result for YS jagan advised by Prashant Kishor
అక్కడ ప్రశాంత్ కిశోర్‌ను, ఆయన బృందాన్ని ప్రత్యేకంగా అభినందించారు. ప్రశాంత్ కిశోర్‌కు చెందిన ఐప్యాక్ బృందం రెండేళ్లుగా వైసీపీకి సేవలు అందిస్తోంది. ఎన్నికలు ముగిసిన తర్వాత ఐప్యాక్ ఆఫీసుకు వెళ్లిన జగన్ అక్కడున్న ఉద్యోగులను నవ్వుతూ ప్రతి ఒక్కరిని పలకరించారు. అందరికీ ప్రత్యేకంగా కృతఙ్జతలు చెప్పారు. 


ఈ క్రమంలో ప్రశాంత్ కిశోర్, జగన్మోహనరెడ్డికి ఒక సూచన చేశారు. "ఏపీలో మీరే సీఎం కాబోతున్నారు. "మీరు సీఎం కావాలి. ఏపీ ప్రజలకు సుపరిపాలన అందించాలి" అని ప్రశాంత్ కిశోర్ సూచించారు. నిజంగా ఒక వ్యూహకర్త ఇచ్చిన ఈ సందేశం అనుసరించటం వైఎస్ జగన్మోహనరెడ్డికి అత్యంత అనుసరణీయం.  

Image result for YS jagan advised by Prashant Kishor

ఆంధ్రప్రదేశ్ శాసనసభ, లోకసభ ఎన్నికలు ముగియడంతో వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కాస్తా విశ్రాంతి దొరికినట్లుంది. చాలా కాలంగా ఆయన ప్రజల మధ్యనే ఉంటూ వచ్చారు. గురువారం సాయంత్రం హైదరాబాదులో గల తన నివాసం లోటస్ పాండులో మీడియాతో మాట్లాడారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: