ఎన్నికల వ్యహకర్త ప్రశాంత్ కిషోర్ జగన్ పార్టీకి పనిచేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఎన్నికలు అయిపోవడంతో పీకే టీం జగన్ కు ఎన్ని సీట్లు రావొచ్చో ఒక వివేదికను ఇచ్చింది. ఏపీలో పోలింగ్ పూర్తి కాగానే వైసీపీ అధినేత జగన్.. ప్రశాంత్ కిశోర్ను కలిశారు. ఎన్నికల సరళిపై కాసేపు మాట్లాడారు. పార్టీ కోసం పనిచేసిన ప్రశాంత్ కిశోర్కు జగన్ ప్రత్యేకంగా 'ధన్యవాదాలు' అని చెప్పారు. ఆయనను ఆప్యాయంగా కౌగిలించుకొని వారి బృందంతో గడిపారు. ఈ సందర్భంగా ప్రశాంత్ కిశోర్ జగన్తో పలు విషయాలు చర్చించినట్లు సమాచారం.


 ఎన్నికల తరువాత ప్రశాంత్ కిశోర్  బృందం సర్వే జరిపింది. ఈ సర్వేలో వైసీపీ 125 స్థానాల్లో రాబోతుందని జగన్కు చెప్పారని సమాచారం. పార్లమెంట్లో 20 స్థానాలు గెలుస్తారని వివరించారట. చంద్రబాబు ఐదేళ్లలో అన్నీ చేశానని అబద్దాలు ఆడారని దీంతో ప్రజలు ఆయనను నమ్మలేకపోయారని చెప్పారు. వైసీపీకి ఒక్కసారి అవకాశం ఇస్తే అభివృద్ధి జరగొచ్చు అనే అంచనాతో ప్రజలు ఓటేయడానికి వచ్చారని తేల్చారు.


 గత ఎన్నికల్లో వైసీపీ పోటాపోటీగా సీట్లు గెలుచుకున్నా కోస్తాంధ్రలో సీట్లు రాబట్టుకోలేకపోయింది. అయితే ఈసారి ఉత్తరాంధ్రలో సీట్లు వస్తాయి గానీ.. తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో మాత్రం పవన్ ప్రభంజనం ఉంటుందన్నారు. విశాఖ జిల్లాలోని గాజువాక పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరంలో పవన్ గెలుస్తాడని ప్రశాంత్ నివేదికనిచ్చారు. కాపు సామాజిక ఓట్లు పవన్కే ఎక్కువగా పడ్డాయని ఆయా జిల్లాలో టీడీపీకి  మూడు లేదా నాలుగు సీట్లు మాత్రమే వస్తాయని చెప్పారు. ఈ నివేదికతో జగన్ సంతృప్తి చెందినట్లు సమాచారం. 

మరింత సమాచారం తెలుసుకోండి: