ప్రశాంత్ కిషోర్... బీహార్ కు చెందిన యంగ్ పొలిటీషియన్.. ఈయన పేరు ఇప్పుడు బీహార్లో కంటే ఏపీలోనే ఎక్కువగా వినిపిస్తోంది. ఎన్నికల పోలింగ్ పూర్తికాగానే....వైసీపీ అధినేత జగన్ వెళ్లి ప్రశాంత్ కిషోర్ టీమ్ను కలవడం.. తమ పార్టీ కోసం బాగా కష్టపడినందుకు ఆయన టీమ్ కు కృతజ్ఞతలు చెప్పడం అందరినీ ఆకర్షించాయి.
ఈ సందర్భంగా ప్రశాంత్ కిశోర్ జగన్ తో ఏం మాట్లాడారు.. ఎన్నిసీట్లు వస్తాయని చెప్పారు.. అనే అంశాలు హాట్ టాపిక్ అయ్యాయి. అయితే ఇక్కడ ఓ కీలకమైన విషయం మాత్రం హైలెట్ కావడం లేదు. జగన్ ప్రశాంత్ కిషోర్ ఆఫీస్కు వెళ్లింది..నిజమే.. అక్కడ చర్చలూ నిజమే.. కానీ ఆ విషయం ఎలా బయటకు వచ్చింది.
ప్రశాంత్ కిశోర్ ఆఫీసులో ఒకరు ఫోన్ తో తీసిన ఈ వీడియో... ముందుగా తెలుగుదేశం అనుకూల మీడియాలోనే టెలికాస్ట్ అయ్యింది. సాక్షి మీడియాలో కాదు.. మరి ఇది ఎలా సాధ్యమైంది. అంటే ప్రశాంత్ కిషోర్ ఆఫీసులోనూ తెలుగుదేశం కోవర్టులు ఉన్నారా... అంతే కదా..అలా ఉంటే తప్ప ఈ వీడియో బయటకు వచ్చే అవకాశం లేదు.
అంటే... వ్యుహ ప్రతివ్యూహాల్లో చాణక్యుడిగా పేరున్న చంద్రబాబు అండ్ టీమ్... ప్రశాంత్ కిషోర్ ఆఫీసులోనూ తన వేగులను ఉంచిందా... ఇదే నిజమైతే... జగన్ అండ్ టీమ్ వ్యూహాలన్నీ ఎప్పటికప్పుడు తెలుగుదేశానికి చేరిపోయి ఉండాలి.. ఇది నిజంగా వైకాపా శ్రేణుల్లో వణుకు పుట్టించే అనుమానమే.. సో..దీన్ని బట్టి తెలిసేదేమిటి.. జగన్ అండ్ కో ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ సీనియర్ను తక్కువ అంచనా వేయకూడదు.