దేశ వ్యాప్తంగా కొన్ని అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు పూర్తయ్యాయి..మరికొన్ని చోట్ల జరగనున్నాయి. ఈ నేపథ్యంలో పార్టీల ముఖ్య నేతలు ప్రత్యర్థి పార్టీలపై అభ్యర్థులపై ఇష్టం వచ్చినట్లు కామెంట్స్ చేయడం మొదలు పెట్టారు.  ముఖ్యంగా ఎన్నికల తేదీ దగ్గరపడుతున్న కొద్దీ ఉత్తరాది రాష్ట్రాల్లో పార్టీల నడుమ విమర్శల వేడి రాజుకుంటోంది.  ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో రెండు ప్రధాన పార్టీలైన బీజేపీ, బిఎస్పీల నడుమ హోరాహోరీ పోరు నెలకొంది.   
ఈ పార్టీల అధినేతలు ప్రచారంలో మునిగిపోయారు..ఈ నేపథ్యంలో ఇరు పార్టీ నేతలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోస్తున్నారు. 

ఇక ప్రచారంలో భాగంగా ప్రస్తుత ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, బిఎస్పీ అధినేత్రి మాయావతి ఘాటైన ప్రసంగాలు చేస్తున్నారు.  ఇదే సమయంలో ఇరు నేతలు కులాల ప్రస్థావనలు తీసుకు రావడంతో అగ్గి రాజుకుంటుంది.  తాజాగా సుప్రీం కోర్టు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తునంవారిని ఎందుకు తేలికగా తీసుకుంటున్నారని ఎలక్షన్ కమీషన్ కు సుప్రీమ్ కోర్టు చురకలంటించింది. 

తాజాగా ఈ ఇద్దరు నేతలపై ఎన్నికల కమీషన్ వారిద్దరిపై ఆగ్రహం వ్యక్తం చేసింది.  రేపు ఉదయం ఆరు గంటల నుండి  48 గంటల పాటు ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా మాయావతిపై ఆంక్షలు విధించిన కేంద్ర ఎన్నికల సంఘం రేపు ఉదయం ఆరు గంటల నుండి 72 గంటల పాటు ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పై ఆంక్షలు విధించింది.  మరి ఈ నిషేదం పై ఇరు పార్టీల నేతలు ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే. 


మరింత సమాచారం తెలుసుకోండి: