చంద్రబాబుకు ఏమైంది..? ఇప్పుడు ఈ ప్రశ్న చాలా మంది అడుగుతున్నారు. ఏపీలో పోలింగ్ ముగిసిన రోజు నుంచి ఒక్కోసారి ఒక్కోలా మాట్లాడుతున్నారు. ముందు రోజు చెప్పిన మాటలకు విరుద్దంగా రెండో రోజు మాట్లాడుతున్నారు. తాజాగా చంద్రబాబు మాటలు చూస్తే ఈ విషయం అర్థమైపోతోంది.


పోలింగ్ ముగిసిన రోజు చంద్రబాబు ప్రెస్ ముందుకు వస్తారని ప్రకటించారు. కానీ ఎందుకనో ఆయన రాలేదు. కానీ ఉదయానికి తమ పార్టీ 120 స్థానాలు గెలుస్తుందని చంద్రబాబు పార్టీ నేతలతో చెప్పినట్టు.. లీకులు ఇచ్చారు. 

ఆ తరవాత చంద్రబాబు 130 స్థానాలు గెలుస్తామన్నట్టు వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఏకంగా 150 స్థానాలు గెలుస్తామని అంటున్నారు చంద్రబాబు. రాష్ట్రాన్ని కాపాడేందుకు ప్రజలు స్వచ్ఛంధంగా వచ్చారని ఆయన అంటున్నారు.అండర్ కరెంట్‌గా ప్రజల స్పందనను చూస్తే  తమ పార్టీకి 150కు పైగా ఎమ్మెల్యే సీట్లు దక్కుతాయని ఆయన అభిప్రాయపడ్డారు.

ఈ వాదన చూసి జనం షాక్ అవుతున్నారు. ఆయన చెప్పినట్టు టీడీపీ 150 పైన రావాలంటే.. వైసీపీకి కేవలం 20- 25 స్థానాలు మాత్రమే రావాలి. మరి అలాంటి పరిస్థితి లేదని టీడీపీ నేతలే చెబుతున్నారు. మరి చంద్రబాబు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు.. ఇదంతా ధైర్యమా.. మేకపోతు గాంభీర్యమా..?


మరింత సమాచారం తెలుసుకోండి: