ఎన్నికల తర్వాత ఇప్పటికే చాలా అంచనాలు వెలువడుతున్నాయి. అయితే వాటిలో చాలా వరకూ విశ్వసనీయత ఎంత అంటే చెప్పలేం.. తాజాగా నాగన్న సర్వే వచ్చింది. ఈ నాగన్న ఇప్పటివరకూ చెప్పిన ఫలితాలు ఏవీ తప్పుకాలేదు. తెలంగాణకు చెందిన నాగన్న తన టీమ్‌తో సర్వేలు చేస్తుంటారు.


తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌లు పూర్తైన వెంట‌నే నాగ‌న్న ఇచ్చిన స‌ర్వేల్లో టీఆర్ఎస్‌కు 88 నుంచి 93 ఎమ్మెల్యే స్థానాల‌ను క‌చ్చితంగా గెలుపొందుతుంద‌ని రిపోర్టు ఇచ్చారు. దాదాపు అలాగే జరిగింది. అంతే కాదు.. బీజేపీకి ఒక్క సీటు మాత్రమే వ‌స్తుంద‌ని కచ్చితంగా చెప్పిన వ్యక్తి నాగ‌న్న. 

మరి ఏపీకి సంబంధించిన నాగన్న ఇచ్చిన రిపోర్టు ప్రకారం వైసీపీ ప్రభుత్వం ఏర్పరడటం ఖాయంగా కనిపిస్తోంది. ఈయన లెక్కల ప్రకారం  వైఎస్ఆర్ కాంగ్రెస్‌కు 99 నుంచి 110 స్థానాల‌ను కైవ‌సం చేసుకుంటుంది. తెలుగుదేశం పార్టీ 49 నుంచి 59 స్థానాల‌ు గెలుస్తుంది. 

మరో 27 స్థానాల్లో వైసీపీ- టీడీపీ మధ్య హోరాహోరీ పోరాటం ఉంటుంది. ఇందులోనూ వైసీపీ 12 స్థానాల్లో కాస్త పైచేయి ఉండగా... టీడీపీ  15 స్థానాల్లో పైచేయి సాధిస్తోంది. ఇక జ‌న‌సేన భీమ‌వ‌రం, గాజువాక‌లో ట‌ఫ్ పోటీ ఇచ్చిన‌ప్పటికీ సీట్లను గెలుపొందే అవ‌కాశం లేద‌ట. ఇదీ నూటికి నూరు శాతం నిజమైన నాగన్న సర్వే. 



మరింత సమాచారం తెలుసుకోండి: