ఏపీలో ఎన్నికలు ముగియడంతో చంద్రబాబు జాతీయ స్థాయి మిత్రులకు సాయం చేస్తున్నారు. అక్కడి ప్రచారాల్లో పాలుపంచుకుంటున్నారు. తెలుగు వారు అధికంగా ఉండే కర్ణాటకలో జేడీఎస్ కు మద్దతుగా చంద్రబాబు ప్రచారం చేశారు. అక్కడి మాండ్య ప్రాంతంలో జేడీఎస్ సభల్లో పాల్గొన్నారు. 


అయితే మాండ్యలో ఒకప్పటి తెలుగు హీరోయిన్‌ సుమలత ఎంపీ బరిలో ఇండిపెండెంట్‌గా నిలిచారు. ఆమె తెలుగు ప్రజలకు చాలా సుపరిచితురాలు. ఎన్నో సినిమాల్లో హీరోయిన్ గా నటించారు. కన్నడ నటుడు అంబరీశ్ ను పెళ్లి చేసుకుని బెంగళూరులలో సెటిలయ్యారు. 

ఇటీవలే అంబరీశ్ మరణించగా.. తన భర్త స్థానంలో ఆమె పోటీ చేస్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు ఆమెను ఓడించాలని... జేడీఎస్ అభ్యర్థి, సీఎం కుమార స్వామి తనయుడు నిఖిల్‌ గౌడను గెలిపించాలని ప్రచారం చేయడం విశేషం. నిఖిల్ గౌడ్‌ గతంలో జాగ్వార్ అనే సినిమాలో నటించారు. ఇది తెలుగులోనూ విడుదలైంది. 

తెలుగులో పదుల కొద్దీ సినిమాలు చేసి తెలుగుప్రజలతో అనుబంధం ఉన్న సుమలత పక్షం కాకుండా తెలుగుతో ఏ సంబంధంలేని నిఖిల్ గౌడ వైపు చంద్రబాబు ప్రచారం చేయడం విశేషంగానే చెప్పకోవాలి. దేవెగౌడతో ఉన్న మైత్రి కారణంగానే చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారు. మరి మాండ్యలోని తెలుగు ప్రజలు చంద్రబాబు మాట వింటారా..? 



మరింత సమాచారం తెలుసుకోండి: