దగ్గరివాడే..పరిచయం ఉన్న వ్యక్తి అని నమ్మి వెళ్తే మత్తు మందు ఇచ్చి ఏడుగురు స్నేహితులతో అత్యంత దారుణంగా అత్యాచారం జరిపాడు.  నగ్నంగా మార్చి ఇష్టానుసారంగా ప్రవర్తించి హింసించారు. హైదరాబాద్‌లోని వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. కొత్తపేటకు చెందిన బాధిత మహిళ (32)కు ఐదేళ్ల క్రితం వివాహం కాగా, భర్తతో మనస్పర్థల కారణంగా రెండేళ్ల క్రితం విడాకులు తీసుకుని ఒంటరిగా ఉంటోంది.   

వనస్థలిపురంలోని మ్యాక్స్‌లైన్ పాలసీ సంస్థలో పనిచేస్తూ జీవిస్తోంది. ఇదే సమయంలో ఆ మహిళలకు మన్సూరాబాద్ కు చెందిన మనోజ్ కుమార్ (30) వ్యక్తి పరిచయం అయ్యాడు.  అప్పుడప్పుడు ఆ మహిళ ఇంటికి రావడం..వారి మద్య స్నేహ సంబంధం పెరిగిపోయింది.  అయితే మనోజ్ కుమార్ అప్పటికే ఇద్దరు పిల్లలు ఉన్న వ్యక్తి.  తన పుట్టిన రోజు వేడుకలు చేసుకుంటున్నామని..శనివారం మధ్యాహ్నం బాధిత మహిళకు ఫోన్ చేసి రమ్మన్నాడు.  అయితే పిలిచింది స్నేహితుడే కదా అని బాధిత మహిళ స్నేహమయనగర్‌లో మనోజ్ కుమార్ ఉన్న చోటికి వెళ్లింది. 

అప్పటికే అతని స్నేహితులతో ఉన్నాడు.  అక్కడికి వెళ్లిన ఆ మహిళకు మాటలు చెబుతూ..బలవంతంగా మద్యం తాగించారు.  ఆ తర్వాత ఆమెపై దారుణంగా అత్యాచారానికి పాల్పపడటమే కాకుండా అతని స్నేహితులతో కూడా అత్యాచారం చేయించాడు. ఈ ఘటనపై బాధిత మహిళ సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. మనోజ్ మరో ఐదుగురితో కలిసి తనపై అత్యాచారం చేసినట్టు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: