నటుడు, రచయిత పోసాని కృష్ణమురళికి ఆవేశం, ఎమోషన్ ఎక్కువన్న సంగతి తెలిసిందే. ఆవేశం వచ్చినా.. అభిమానం వచ్చినా ఆయన తట్టుకునే బాపతు కాదు. అందుకే ఆయన రచయితగా కంటే నటుడుగా బాగా సక్సస్ అయ్యారు.


ఐతే.. ఆ షార్ట్ టెంప‌ర్ కారణంగా ఆయన ఓ హత్య కూడా చేయాలని అనుకున్నాడట. కానీ ఆ తర్వాత తన తప్పు తెలుసుకున్నాడట. ఇంతకీ ఆయన చంపాలనుకున్నది ఎవరినో తెలుసా.. సీనియర్ రచయిత పరుచూరి గోపాలకృష్ణ భార్యగారినట. 

ఎందుకంటే.. పోసాని కృష్ణమురళి పరుచూరి బ్రదర్స్ తో వద్ద శిష్యరికం చేశారు. వాళ్లతో కలిసి చాలా సినిమాలకు పని చేశారు. పరుచూరి భార్యకి పోసాని గురించి ఎవరో ఏవో కల్పించి చెప్పడంతో ఆమె పోసానిని దూరం పెట్టారట. సరిగ్గా ట్రీట్ చేయలేదట. 

దీంతో పోసానికి విపరీతమైన కోపం వచ్చేదట. ఎంతగా అంటే.. ఆమెను పొడవడానికి అప్పట్లో ఓ కత్తి కూడా కొన్నారట. ఆ తరువాత అది తలచుకొని సిగ్గు పడినట్లు, చాలా కుమిలిపోయినట్లు తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. తనకు పరుచూరి బ్రదర్స్ లైఫ్ ఇచ్చారని, వారేదో చిన్న మాట అన్నందుకు పరుచూరి భార్యని చంపాలనే ఆలోచన చేయడం తన తప్పని లెంపలు వేసుకుంటున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: