మంగళగిరి నియోజకవర్గం ఈ సారి బాగా ఆసక్తి రేపుతోంది. కారణం లోకేష్ పోటీ చేస్తుండటం. అయితే ఈ నియోజకవర్గంలో లోకేష్ గెలుస్తాడా లేదా అన్నది ఇప్పుడు పెద్ద హాట్ టాపిక్ అయ్యింది. బెట్టింగు ట్రెండ్ లో ఎక్కువమంది నారా లోకేష్ ఓడతారనే కడుతున్నారట! దీంతో నారా లోకేష్ గెలుస్తారని బెట్టింగ్ వేసే వాళ్లు తక్కువైపోయారు. దీంతో..లోకేష్ గెలిస్తే వారి పంట పండనుంది. లోకేష్ గెలుస్తాడంటూ ఒక రూపాయి బెట్ కాస్తే నిజంగానే అది జరిగితే దానికి రెండు రూపాయలు దక్కే పరిస్థితి ఉందట.


రూపాయికి రెండు రూపాయలు..అనేది నారా లోకేష్ విజయం మీద సాగుతున్న బెట్!లోకేష్  ఓడతారు అంటూ బెట్ కాసే వాళ్లకు ఎక్కువమంది ఉండటంతో ఈ పరిస్థితి తలెత్తింది. అసలు ఒక దశలో ఆయనకు టికెట్ దక్కుతుందా? అనే సందేహాన్ని రేకెత్తించిన ఆళ్ల రామకృష్ణా రెడ్డి ఇప్పుడు హాట్ ఫేవరెట్ గా మారారు.నాలుగైదే వేల  మెజారిటీలో ఆళ్ల గెలవడం ఖాయమనే మాట వెబ్ లో వైరల్ గా మారింది. ఇక అసలు కథ ఏమిటనేది ఫలితాలు వస్తే కానీ తెలియదు.


ఇక లోకేష్ మాత్రం పోలింగ్ అయిపోయాకా పెద్దగా మీడియా ముందుకు రావడం లేదు. పోలింగ్ రోజున నిరసన తెలిపిన ప్రసంగంలో లోకేష్ ‘బిస్కెట్లు ఇవ్వలేదు..’అని అనడం పొరపాటు అయిపోయింది. ఓటు వేసేవాళ్లకు టీలు బిస్కెట్లు ఏర్పాటు చేయడం ఎన్నికల కమిషన్ బాధ్యత కాదు కదా. అలా మాట్లాడి లోకేష్ మరోసారి సోషల్ మీడియాకు చిక్కారు.ఇక లోకేష్ మంగలగిరి గురించి సర్వేలు చేయించుకుంటున్నారనే మాట వినిపిస్తుంది. అక్కడ పరిస్థితి ఎలా ఉందనే అంశం గురించి.. పోలింగ్ ఎలా జరిగి ఉందనే విషయంలో.. లోకేష్ పోస్ట్ పోల్ సర్వేలో మునిగారట!

మరింత సమాచారం తెలుసుకోండి: