నందమూరి బాలకృష్ణ చిన్నల్లుడు, గీతం విద్యాసంస్థల ఛైర్మన్‌ విశాఖపట్నం నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేసిన సంగతి తెలిసిందే. మొదట్లో ఇక్కడ భరత్ గెలుపు ఖాయమనే అంతా అనుకున్నారు. కానీ అనూహ్యంగా ఇక్కడ సీబీఐ మాజీ అధికారి జేడీ లక్ష్మీనారాయణ జనసేన నుంచి పోటీ చేయడంతో పోటీ బాగా టఫ్ అయ్యింది. 


పోలింగ్ అయ్యాక ఏం జరిగిందని పరిశీలిస్తే.. చాలా వరకూ తెలుగుదేశం ఓట్లు ఎంపీ అభ్యర్థి విషయంలో క్రాస్ జరిగినట్టు తెలుస్తోంది. అంటే ఎమ్మెల్యే ఓట్లు టీడీపీకి పడినా ఎంపీ ఓట్లు మాత్రం టీడీపీవి జేడీకి పడ్డాయన్నమాట. దీంతో జేడీ గెలుపు ఖాయం అన్న అంచనాలు బాగా వినిపిస్తున్నాయి. 

అయితే ఇదంతా చంద్రబాబు చేయించాడన్న వాదన ఇప్పుడు భరత్‌ ను ఇబ్బంది పెడుతోంది. జేడీ ముందు టీడీపీలో చేరాలనుకున్న సంగతి తెలిసిందే. అయితే ఆ తర్వాత ఆయన జనసేనలో చేరడం విశాఖ నుంచి పోటీ చేయడం అంతా చంద్రబాబు డైరెక్షన్ లోనే జరిగిందని ఓ వాదన ఉంది. 

పోలింగ్ తీరును సమీక్షించుకున్న భరత్ ఇప్పుడు ఈ వాదనవైపే మొగ్గుతున్నారట. చంద్రబాబు కావాలనే జేడీ కోసం తనను బలిపశువును చేశారన్న ఆవేదనలో ఉన్నారని కథనాలు వస్తున్నాయి. మరి జేడీపై చంద్రబాబు అంత ప్రేమ ఎందుకు చూపించి ఉంటారు.. సొంత కుటుంబ సభ్యుడిని ఎందుకు ఇబ్బంది పెట్టారు అన్న ప్రశ్నలకు సమాధానాలు వెదుకుతున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: