కోటి.. ఇటీవల ఎన్టీఆర్ భార్య లక్ష్మీపార్వతి తనను లైంగికంగా వేధిస్తోందంటూ పోలీసులకు ఫిర్యాదు చేసి వార్తల్లోకి ఎక్కిన వ్యక్తం. లక్ష్మీ పార్వతి తనకు బూతు వీడియోలు పంపిందని కూడా కోటి ఆరోపించారు. అంతే కాదు.. ఆమె ఎన్టీఆర్‌ ను కూడా చులకనగా మాట్లాడారని చెప్పుకొచ్చాడు. 


ఇప్పుడు ఈ ఉదంతంపై లక్ష్మీపార్వతి దృష్టిపెట్టారు. తనపై దుష్ప్రచారం చేస్తున్న కోటిపై చర్యలు తీసుకోవాలని ఆమె హైదరాబాద్‌లో డీజీపీని కలసి ఫిర్యాదు చేసారు. తెలంగాణ డీజీపీ మహేందర్‌రెడ్డితో భేటీ అయిన లక్ష్మీపార్వతి తనపై  సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారంపై ఫిర్యాదు చేశారు. 

కోటి అనే యువకుడితో పాటు కొందరు వ్యక్తులు తనను టార్గెట్ చేసి సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తనపై ఆరోపణలు చేసిన కోటి అనే వ్యక్తిని బిడ్డగా భావించానని ఆమె స్పష్టం చేశారు. అలాంటి వ్యక్తి తనపై తప్పుడు ఆరోపణలు చెయ్యడం వెనుక కుట్ర దాగి ఉందని ఆమె అంటున్నారు.  

తనపై సాగుతున్న దుష్ప్రచారం  వెనుక ఉన్న కుట్రలను  ఛేదించాలని లక్ష్మీపార్వతి కోరారు. తనకు న్యాయం చెయ్యాలన్నారు.  తనలాంటి వ్యక్తికే ఇంత అవమానం జరిగితే.. సామాన్య స్త్రీల పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చని అన్నారు.  60 ఏళ్ల వయసున్న మహిళలను కూడా ఈ విధంగా అవమానించడం దారునం అని లక్ష్మీపార్వతి అన్నారు. కోటితో పాటు తప్పుడు వార్తలు ప్రసారం చేసిన మీడియా ఛానల్, యాంకర్‌పై కూడా చర్యలు తీసుకోవాలని ఆమె డీజీపిని కోరారు. తన పరువు, మర్యాదలు కాపాడాలని లక్ష్మీపార్వతి డీజీపీని కోరారు.



మరింత సమాచారం తెలుసుకోండి: