రాజకీయాలను వదిలేసిన రెండున్నర దశాబ్దాల తరువాత ప్రముఖ నటుడు మోహన్ బాబు రీ ఎంట్రీవే చాలా చిత్రంగా జరిగింది. ఆయన అనూహ్యంగా వైసీపీలో చేరిపోవడం, అంతే స్పీడ్ గా ఎన్నికల సభల్లో ప్రసంగాలు చేయడం అందరికీ తెల్సిందే. ఆయన హాట్ కామెంట్స్ వాడి వేడి ప్రసంగాలు ఈ సారి ఎన్నికల్లో ఏపీలో వెరీ వెరీ స్పెషల్.


ఇక మోహన్ బాబు తన బాణాలను ఇంకా బాబు మీద విసురుతూనే ఉన్నారు. కర్నాటకలోని మాండ్య లోక్ సభ సీట్లో ఇండిపెండెంట్ గా బరిలో ఉన్న సినీ నటి, కేంద్ర మంత్రి అంబరీష్ సతీమణి అయిన సుమలతకు మద్దతుగా మోహన్ బాబు ఈ రోజు ఓ పొస్ట్ పెట్టారు. ఆమెను మాండ్య ప్రజలు ఎన్నుకోవాలని అందులో కోరారు. అంబరీష్ తో తన స్నేహం ఆయన మాండ్య  ప్రజలకు చేసిన సేవలు గుర్తు చేసుకున్నారు ఈ సందర్భంగా చంద్రబాబు మీద మోహన్ బాబు చేసిన కొన్ని వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి.


చంద్రబాబు మాటలు ఎవరూ వినవద్దు అంటూ మాండ్య ప్రజలను ఆయన కోరారు. బాబు ఒకపుడు ఏపీకి సీఎం ఇపుడు కాదు, మరెప్పటికీ ఆయన కాలేరు అంటూ మోహన్ బాబు చేసిన హాట్ కామెంట్స్ మరో మారు  రచ్చ రేపేలా ఉన్నాయి. ఆయన వచ్చే ఎన్నికల్లో ఓడిపోతారని మోహన్ బాబు గట్టిగా నమ్ముతున్నట్లుగా ఆ పోస్ట్ చెబుతోంది. అంతే కాదు, చంద్రబాబుకు చంద్రబాబుకు ఏమాత్రం కృతజ్ఞతాభావం లేదు. అతని కోసం అంబరీష్‌ చాలా చేశారు. అలాంటి అతని భార్యను ఓడగొట్టడానికి ప్రయత్నిస్తున్నారు. 
సుమలతకు వ్యతిరేకంగా చంద్రబాబు ప్రచారం చేయడం హాస్యాస్పదం. ఆశ్చర్యకరం. కులం, డబ్బు రాజకీయాలను పక్కనబెట్టి సుమలతను గెలిపిస్తారని ఆశీస్తున్నాను.’ మోహన్‌బాబు పేర్కొన్నారు. మొత్తానికి మోహన్ బాబు తీర్పు అయితే చంద్రబాబు మాజీ  సీఎం, ఇక ఎప్పటికీ అయన ఏపీకి సీఎం కాలేరని తేలిపోతోందన్నమాట.


మరింత సమాచారం తెలుసుకోండి: