చంద్రబాబుకు ఓటమి ఖాయమని ఇప్పటికే తనకు అర్ధం అయ్యిందని అందరూ భావిస్తున్నారు. ఈవీఎంల మీద లేనిపోని రాద్ధాంతం చేసినప్పుడే చంద్రబాబుకు ఓటమి ఖాయమని అందరూ చెబుతున్నారు. 'ఈవీఎంలు ట్యాంపర్ అయ్యాయి.. కనీసం సగం వీవీ ప్యాట్స్ ను కౌంట్ చేయాలి...' అంటూ చంద్రబాబు నాయుడు వాదిస్తూ ఉన్నారు. అయితే ఇది అసంబద్ధమైన వాదనగా తేలిపోతూ ఉంది.తెలుగుదేశం అధినేత తాము గెలిచినప్పుడేమో ఈవీఎంలను తప్పు పట్టలేదు.


గత సార్వత్రిక ఎన్నికలూ ఈవీఎంల మీదే జరిగాయి. నంద్యాల ఉప ఎన్నికలూ ఈవీఎంల మీదే జరిగాయి. అయితే అప్పుడంతా చంద్రబాబు నాయుడు ఈవీఎంల పనితీరు మీద ఏమీ మాట్లాడలేదు.ఆ మధ్య ఈవీఎంల విషయంలో ట్యాంపరింగ్ పై సీఈసీ ఓపెన్ చాలెంజ్ చేసినా.. చంద్రబాబు నాయుడు స్పందించలేదు. తీరా పోలింగ్ అయిపోయినదగ్గర నుంచి బాబు ఒకే వాదననే అరిగిపోయేలా వినిపిస్తూ ఉన్నారు. 


ఇదంతా వ్యూహాత్మకం అని..జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి తప్పదనే లెక్కలతోనే చంద్రబాబు నాయుడు ఇలా మాట్లాడుతూ ఉన్నారని ఓడిపోయాకా ఈవీఎంల మీద అభాండాలు వేస్తే జనాలు నవ్వుతారని అందుకే ఇంకా ఫలితాలు రాకనే ఇలా మాట్లాడేస్తే ఒక పని అయిపోతుందన్నట్టుగా.. ఐదేళ్ల పాటు ఇదే వాదనను అరగదీస్తూ ఉండొచ్చని చంద్రబాబు నాయుడు భావిస్తున్నట్టున్నారని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు!

మరింత సమాచారం తెలుసుకోండి: