నారా లోకేశ్.. ఏపీ సీఎం చంద్రబాబు తనయుడు.. ఐటీ శాఖ మంత్రి.. మొదట పార్టీ బాథ్యతలు చూసిన ఈ యువనాయకుడు.. ఆ తర్వాత ప్రభుత్వంలోనూ కీలక పాత్ర పోషించారు. తండ్రి తర్వాత సెకండ్ ప్లేస్ లో విధులు నిర్వహించారు. 


మంచి చదువు, లోకజ్ఞానం, తెలివి తేటలు ఉన్నా.. కేవలం ప్రసంగాల్లో దొర్లిన తప్పుల కారణంగా బాగా బద్‌నామ్ అయ్యారు. వైసీపీ ఎమ్మెల్యే రోజా ఏ నిమిషంలో లోకేశ్‌ ను పప్పు అన్నారో తెలియదు కానీ.. ఆ టైటిల్ బాగా పాపులర్ అయ్యింది. వైసీపీ శ్రేణులంతా ఆ పేరుతోనే లోకేశ్ ను వెటకారం చేస్తున్నారు. 

ఇప్పుడు బీజేపీనేత సోము వీర్రాజు.. మరో కొత్త పేరు పెట్టారు లోకేశ్ కు.. అది తింగర మంగళం.. లోకేశ్ మంగళగిరి అసెంబ్లీలో  పోటీ చేయడం వల్ల ఈ టైటిల్ ఇంకాస్త బాగా సూట్ అవుతుందనుకున్నారో ఏమో .. సోము వీర్రాజు అలా పిలిచేశారు. 

ఇప్పుడు వైసీపీ శ్రేణులు.. టీడీపీ వ్యతిరేక వర్గాలు ఈ పేరును పాపులర్ చేస్తున్నాయి. ఏదేమైనా ఇలా వ్యక్తులను వెటకారం చేసే రీతిలో దుష్ప్రచారం చేయడాన్ని నిరసించాల్సిందే. ఇదే సమయంలో లోకేశ్ వంటి నేతలు కూడా తగిన జాగ్రత్తలు తీసుకుంటే బావుంటుంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: