ఎన్నికల తర్వాత చాలా మంది చాలా రకాలుగా ఫలితాలపై విశ్లేషించారు. ఒక్కొక్కరిదీ ఒక్కో వాదన. ఐతే.. సోషల్ మీడియా పుణ్యాన.. ప్రతి ఒక్కరూ తమ అభిప్రాయాలు పంచుకునే అవకాశం దక్కుతోంది. తాజాగా ఓ డ్రైవర్‌ వైసీపీకి ఎన్ని సీట్లు వస్తాయో లెక్క వేసి చెప్పారు. 


ఆయన లెక్క ప్రకారం వైసీపీకి 114-120 వస్తాయని అంచనా వేస్తున్నారు. డ్రైవర్ కు రాజకీయాలు ఏం తెలుసని తక్కువ అంచనా వేయకండి.. చాలామంది కూర్చున్న చోటు నుంచి కదలకుండానే ప్రపంచం గురించి అంతా తెలిసినట్టు చెబుతుంటారు.

కానీ డ్రైవర్లు... ప్రపంచంలో తిరుగుతూ..  రకరకాల ప్రాంతాల మనుషులు, భాషలు.. భావాలను పంచుకుంటుంటారు. అందుకే వారి వాదనకూ విలువ ఉంటుంది. డ్రైవర్ కుటుంబాలను ఆదుకుంటానని ఎన్నికల సభల్లోనూ, మేనిఫెస్టోల్లోనూ జగన్ చెప్పినందువల్ల జగన్ సీఎం కావాలని ఓ డ్రైవర్ కోరుకుంటున్నారు.

జగన్ పై అభిమానంతో డ్రైవర్ భరోసా యాత్ర పేరుతో శ్రీకాకుళం నుంచి చిత్తూరు జిల్లా తలకోన సిద్ధేశ్వర స్వామి ఆలయానికి కుటుంబంతో వచ్చారు ఈ డ్రైవర్‌. జగన్ సీఎం అవుతాడని ధీమాగా చెబుతున్నారు. జగన్ సీఎం అయితే ఏపీలోని డ్రైవర్ల కుటుంబాలన్నీ బాగుపడతాయని ఆశిస్తున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: