ఏపీ ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ కొనసాగుతున్నా.. చాలావరకూ జగన్ సీఎం అవుతాడని చాలా మంది ఫిక్సయిపోయారు. ఇక వైసీపీ క్యాడర్ అయితే మే 23 ఎప్పుడు వస్తుందా.. జగన్ సీఎం అన్న వార్త ఎప్పుడు విందామా అని ఎదురు చూస్తున్నారు. ఫలితాలపై ఎవరి అంచనాలు వారికి ఉన్నాయి.


అయితే పోలింగ్ తర్వాత చంద్రబాబు స్వయంగా చేయించుకున్న సర్వే ఫలితాలపై ఊహాగానాలు వస్తున్నాయి. ఆయనే స్వయంగా తనవద్ద సర్వే ఉందని చెప్పడంతో అది ఏమై ఉంటుందా అన్న ఉత్కంఠ నెలకొంది. తన సొంత సర్వే గురించి చంద్రబాబు పార్టీ నేతలతో మాట్లాడారట. 

ఆ వివరాలు ప్రకారం.. టీడీపీకి 120 సీట్లు ఖాయమని ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ధీమా వ్యక్తం చేశారట. సొంత సర్వేలు, క్షేత్రస్థాయి పరిస్థితులు అధ్యయనం చేసిన తరువాతే తాను ఈ విషయం చెబుతున్నానని ఆయన స్పష్టం చేశారు. ఈ నెల 22న పార్టీ తరపున
అసెంబ్లీ, పార్లమెంట్‌కు పోటీ చేసిన అభ్యర్థులందరితో సమావేశం కావాలని చంద్రబాబు నిర్ణయించారు. 

ఈ సమావేశంలో ఎన్నికల సరళి, పోలింగ్ జరిగిన తీరు గురించి అభ్యర్థుల నుంచి సమాచారం తీసుకోనున్నారు చంద్రబాబు. ఎన్నికల్లో టీడీపీ గెలుపు అనుమానమే అని ఊహాగానాలు వినిపిస్తున్న నేపథ్యంలో... పార్టీ అభ్యర్థులకు చంద్రబాబు ఏం చెప్పబోతున్నారనే అంశం ఆసక్తికరంగా మారింది. చంద్రబాబు మాత్రం గెలుపుపై చాలా ధీమాగా ఉన్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: