రాజకీయ దిగ్గజం ఓ వైపు..దేశంలోనే ముఖ్యమైన పార్టీ తెరవెనుక సర్వసంగా ఉండే వేదిక నాయకుడు మరోవైపు. ఈ ఇద్దరు ఒకే వేదికపై రావడం సంచలనాన్ని కలిగిస్తోంది. ఆయనే సుప్రసిద్ధ వ్యాపారవేత్త రతన్ టాటా. ఆ ప్రముఖుడే ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్. ఈ ఇద్దరు ఒకే వేదికపై భేటీ అయ్యారు. అది కూడా ఆర్ఎస్ఎస్ కార్యాలయంలో. ఈనెల 17వ తేదీన ఈ సమావేశం జరిగింది.
విశ్వసనీయవర్గాల సమాచారం మేరకు నాగపూర్లోని ఆర్ఎస్ఎస్ ప్రధానకార్యాలయంలో సుమారు రెండు గంటల పాటు రతన్ టాటా, మోహన్ భగవత్ ఇద్దరూ మాట్లాడుకున్నారు. లోక్సభ ఎన్నికలు జరుగుతున్న వేళ.. ఇద్దరూ కలవడం చర్చనీయాంశంగా మారింది. కాగా, మర్యాదపూర్వకంగా ఆ భేటీ జరిగినట్లు కొందరంటున్నారు. రెండు రోజల క్రితమే మరో వ్యాపారవేత్త ముకేశ్ అంబానీ.. ఓ కాంగ్రెస్ ఎంపీకి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించడం మరో వ్యాపార దిగ్గజం బీజేపీకి చేరవ అవడం గమనార్హం.
ఇదిలాఉండగా, ఆర్ఎస్ఎస్ ఆఫీసుకు రతన్ టాటా వెళ్లడం ఇది రెండవసారి. ఆయన మొదటిసారి 2016, డిసెంబర్ 28వ తేదీన అక్కడకు వెళ్లారు. గత ఏడాది టాటా గ్రూపు అధినేత రతన్ను భగవత్ మెచ్చుకున్నారు. ఓ ఆర్ఎస్ఎస్ కార్యక్రమానికి ఆయన అతిథిగా కూడా వెళ్లారు.