తాము నమ్మే నాయకుడు తమకు దేవుడిలా భావిస్తుంటారు..ఇప్పుడు ఏపిలో టీడీపీ నేతల పరిస్థితి ఇలాగే ఉంది. మొన్నటి వరకు ఎన్నికల సందర్బంగా తమ అధినేత చంద్రబాబు నాయుడు తమ కోసం..ప్రజల కోసం ఎన్నో కష్టాలు పడుతున్నాడని..మే 23 తర్వాత ఇక శ్రీరామ రాజ్యం రాబోతుందని..ఆంధ్ర రాష్ట్రాన్ని శ్రీరామ చంద్రుడు పాలించబోతున్నారని.. చంద్రబాబు నాయుడు గారి అనుంగుడు..పరమ భక్తుడు బుద్దా వెంకన్న అన్నారు.
ఇక రెండు మూడు రోజులు నుంచి వైసీపీ, బిజెపి నేతలు తెగ మాట్లాడుతున్నారు...ఈరోజున చంద్రబాబు నాయుడు గారు ఈవీఎం ల గురించి మాట్లాడుతున్నారంటే..2014 లో ఇదే ముఖ్యమంత్రి ఈవీఎంల పై మాట్లాడలేదు..ఈ రోజు మాట్లాదడుతున్నారని ప్తరి పక్ష నేతలు ఆరోపిస్తున్నారు..అయితే 2014 ప్రధానిగా మోడీ లేరని..ప్రస్తుతం దేశానికి ప్రధాని శాడిస్టులా తయారయ్యారని అన్నారు. ఆయన హయాంలో ఈవీఎంలో మోసం ఉందని అనుమానం వ్యక్తం చేస్తున్నామని అన్నారు బుద్ద.
గతంలో ఈవీఎంలు రెండు మూడు గంటల వరకు మోరాయించలేదు..ఇక ఏపిలో మహిళాలోకం బాబు గారికి పట్టం కడుతున్నారని తెలిసి..కావాలని ఆరేడుగంటలు ఈవీఎంలు పనిచేయకపోతే ఈ విషయంపై ఈసిని ప్రశ్నించడం బాబు చేసిన తప్పా అన్నారు బుద్దా. ఈవీఎలు పనిచేయకుంటే మీరెందుకు కామ్ గా ఉన్నారని వైసీపీ, బీజేపిని ప్రశ్నించారు. మీకు మహిళల ఓట్లు పడవు..అందుకు ఉదయం మోరాయించేలా చేశారని ఆరోపించారు బుద్ద. అందుకే ఉదయం నుంచి మధ్యాహ్ననం వరకు పనిచేయకుండా చేశారని బుద్ద వెంకన్న ఆరోపించారు.
వైసీపీ నాయకులకు చెబుతున్నా..రేపొచ్చేది చంద్రబాబు నాయుడు ప్రభుత్వమే..తొడగొట్టి చెబుతున్నా అని అన్నారు. అయితే పోలింగ్ రోజు 30 శాతం మాత్రమే ఈవీఎంలు పనిచేయలేదే..అది కూడా ముఖ్యమంత్రి ఇంటి పరిసర ప్రాంతాల్లోనే అని స్వయంగా ముఖ్యమంత్రి ప్రెస్ మీట్ లో చెప్పారు. మరి అలాంటిది ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఈవీఎలు పనిచేయకుండా 60 శాతం ఓటింగ్ ఎలా దాటిందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఆంధ్రప్రజ.
దొంగా దొంగా అంటే భుజాలు తడుముకున్నట్లు.. గెలుస్తామన్న ఏ నాయకులు కూడా ఇంత భయంకరమైన హడావుడి చేయరని..ఆ ధీమా వేరే ఉంటుంది..ఓడిపోతామనే భయం ఉన్నందునే తేదేపా, చంద్రబాబు ఇంత హడావుడి సృస్టిస్తున్నారని వైసీపీ నేతలు, రాజకీయవ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.