ఏపీలో ఎన్నికలు అయిపోయాయి. కానీ కొన్ని రకాల  సర్వేలు ఇపుడు ఒకటొకటిగా బయటకు వస్తున్నాయి. అందులో పేరున్న సర్వేలు కాదు కానీ కొంతమంది ఉత్సాహవంతులు తాము ఏపీలో చేసిన వాటిని ఇపుడిపుడే వాటప్స్ ల ద్వారా ఇతర సాధనాల ద్వారా జనాలకు తెలియచేస్తున్నారు. అందులో ఓ సర్వే ఇపుడు సోషల్ మీడయాలో చక్కర్లు కొడుతోంది. ఈ సర్వే బట్టి చూస్తే  షాకింగ్ రిజల్ట్స్ రాబోతున్నాయని తేలింది.


ఏపీలో మళ్ళీ చంద్రబాబునాయుడు అధికారంలోకి వస్తారని తాజాగా ఈటీవీ 9 పేరిట చేసిన ఓ సర్వే వెల్లడించింది. ఆ సర్వే ప్రకారం టీడీపీకి 99 నుంచి 114 సీట్లు, వైసీపీకి 55 నుంచి 69 సీట్లు లభిస్తాయి. అలాగే జనసేనకు 2 నుంచి 6 సీట్లు దక్కుతాయని తెలింది. క్షేత్ర స్థాయిలో పూర్తిగా పరిశీలన చేసిన మీదటనే ఈ సర్వే చేసినట్లుగా ఈటీవీ 9 నిర్వాహకులు చెబుతున్నారు. ఈ సర్వే ప్రకారం చంద్రబాబుకు పూర్తి సానుకూలత ఉందని అంటున్నారు.


పోలవరం, అమరావతి వంటి నిర్మాణాలు చంద్రబాబు వల్లనే సాధ్యమని ఈ సర్వే తేల్చింది. అదే విధంగా ఈ సర్వే ప్రకారం పసుపు కుంకుమ, పించన్లు జనాలలో  బాగా పనిచేశాయని కూడా తేలింది. రాయ‌లసీమలో నువ్వా నేనా అన్నట్లుగా వైసీపీ, టీడీపీ మధ్య పోటీ ఉంటుంది కానీ గుంటూరు నుంచి మొదలుకుని ఉత్తరాంధ్ర వరకూ ఉన్న కోస్తా జిల్లాల్లో వార్ వన్ సైడ్ గా సాగిందని చెబుతున్నారు. మొత్తానికి చూస్తే బాబు సీఎం కావాలన్న అనుకూల ఓటే ఈసారి గెలిపించబోతోందని చెబుతున్నారు. 


అన్నట్లు ఈ సర్వే నిర్వాహకులు  తెలంగాణా ఎన్నికల్లో కూడా తమదైన రీతిలో సర్వే చేశారట. అక్కడ పూర్తిగా కేసీయార్ కి ఫలితాలు వస్తాయని 87 సీట్లు ఖాయమని చెప్పి నిజమైందని కూడా పేర్కొంటున్నారు. జాతీయ సర్వేలు పైపైన చేస్తాయని, తాము నిజాయతీగా కేత్ర  స్థాయి నుంచి చేస్తున్నామని అందువల్ల తమకు విశ్వసనీయత ఉందని కూదా చెప్పుకుంటున్నారు. మరి చూడాలి ఈ సర్వే ఎంతవరకూ కరెక్ట్ అన్నది. 


మరింత సమాచారం తెలుసుకోండి: