అందరికీ శకునం చెప్పే బల్లి కుడితిలో పడ్దట్టుంది ఏపి అపద్ధర్మ ముఖ్యమంత్రి తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తీరు చూస్తుంటే ఆయన మాట్లాడేటప్పుడు ఒకసారి అద్ధంలో చూసుకుంటే మంచిది   ఒకరి వైపు తన చూపుడువేలెత్తి చూపిస్తే మిగిలిన  నాలుగు వేళ్ళు తననే చూపిస్తున్నయని  తెలుస్తుంది.   


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  "ఎన్నికల సంఘాన్ని దుర్వినియోగం చేయాలని చూశారు" అని అపద్ధర్మ ముఖ్యమంత్రి ఆరోపించారు. తన పోరాటం ఎన్నికల సంఘంపై కాదని అది పాటించే విధానాలపైనే నని చెప్పుకొచ్చారు. ముందు ఎన్నికల సంఘాన్ని ధారుణంగా విమర్శించి దాని అధికారి సౌమ్యుడైన గోపాల కృష్ణ ద్వివేదిని బెదిరించిన మీరు,  ఈసి విధి విధానాలను మాత్రమే ప్రశ్నించినట్లెలా ఔతుంది?  


తిరుపతిలో పర్యటించిన ఆయన ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్త నిధి కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ముఖ్యమంత్రి తాను తిరుపతి నుంచే రాజకీయ జీవితాన్ని ప్రారంభించానని, విద్యార్థి దశ నుంచే రాజకీయాల్లోకి వచ్చానని గుర్తు చేశారు.  ఆనాటి నుంచి ఈనాటి వరకు న్యాయం కోసం పోరాడుతూనే ఉన్నానని, రాష్ట్రం కోసం నీతి, నిజాయితీతో కష్టపడి పనిచేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. న్యాయం కోసం రాజీలేని పోరాటం చేశానని జాతీయస్థాయిలో ఎక్కడ అన్యాయం జరిగినా అక్కడ పోరాటం చేశానని చెప్పుకొచ్చారు. 


విభజనతో ఏపీ తీవ్రంగా నష్టపోయిందన్నారు. రాష్ట్ర విభజన అనివార్యమైతే రెండు ప్రాంతాలకూ న్యాయం చేయాలని కోరినట్లు గుర్తు చేశారు. విభజన హామీలు, ప్రత్యేక హోదా పై తిరుపతిలో ప్రధాని నరేంద్ర మోదీ హామీ ఇచ్చారని తీరా ఎన్నికల్లో గెలిచాక హామీలను అమలు చెయ్యకుండా ఏపీ ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. 

 

మీ మాటాల్లో మీరు చెప్పే నిజాయతీ మీచేతల్లో కనిపించదు. గౌతమీపుత్ర శాతకర్ణికి, రుద్రమదేవి సినిమాల పట్ల మీరు ప్రదర్శించిన ద్వైదీ భావం ద్వంద విధానం  చాలు మీలో నీతి ఉందా, నిజాయతీ ఉందా, బందు ప్రీతి ఉందా, కులకాంక్ష ఉందా, ప్రాంత పిచ్చి ఉందా అని తెలియటానికి. అసలు ఆనాడు మీరు మీ ప్రభుత్వం (ఇక్కడ నిజంగా చెప్పాలంటే మీ పార్టీ అనాలి) పక్షపాతంవివక్షతో ప్రకటించిన బంగారు నందుల గురించి ఎంత తక్కువ చెపితే అంత మంచిదివిభజన హామీల సాధన కోసం దాదాపుగా ఏడాదిపాటు ధర్మపోరాట దీక్షలు చేశానని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం దేశంలో వ్యవస్థలను నిర్వీర్యంచేసే పరిస్థితికి మోదీ దిగజారా రని ఆరోపించారు.


మీరు ప్రభుత్వంలో ఉన్నారు. అధికారం మీది. అసలు మీరు దీక్షలు చేయటమేమిటి? దీక్షలు చేసేది ఎందుకు? ప్రభుత్వం దృష్టి లోకి సమస్యలను తీసుకెళ్ళటానికే కదా! కాని ప్రభుత్వం మీదే కదా! అధినేత మీరే కదా! ఇక మీరే మీ దృష్టిలోకి తెచ్చుకోవటమేమిటి? మీ 'బాడీ మైండ్ సోల్' కలసి పనిచేయటం మానేశాయా! అవి ఆటోమాటిక్ గా సింక్ అవ్వవా? మీరే శాసనసభలో ఒక రిజల్యూషణ్ పాస్ చేసి కేంద్రానికి పంపితే సరిపోదా? దీని దీక్షల పేరుతో ప్రజాధనాన్ని నీళ్ళ  ప్రాయం చెయ్యటం ఎందుకు? విభజనతో ఆర్ధికంగా చితికిన రాష్ట్రాన్ని మీ దుబారాతో కటిక దారిద్రంలోకి నెట్టేయటం కాదా!  


మీరు సంపద సృష్టించానంటారు. అదేమీ రాష్ట్రంలో కనిపించ ట్లేదు. కాని ప్రతి సంవత్సరం మీ కుటుంబం తరపున మీ లోకెష్ ప్రకటించే ఆస్తులలో కనిపిస్తూనే ఉంది. కాని రాష్ట్ర అప్పుల చిట్టా చరిత్రలో ఎన్నడూ లేనంతగా పెరిగిపోయింది.   

Image result for sadineni yamini hate speech 


కర్ణాటక, ఒడిషా ముఖ్యమంత్రులు ప్రయాణించే హెలికాప్టర్లను ఈసీ అధికారులు తనిఖీ చేశారని కానీ ప్రధాని నరేంద్ర మోదీ హెలికాప్టర్ ను తనిఖీ చేసిన అధికారిని మాత్రం సస్పెండ్ చేశారని ఇదేమి వ్యవస్థ అంటూ మండి పడ్డారు. ఇందులో మనం ఆలోచించాల్సింది ఒకటుంది.


ప్రధాని ప్రయాణించే హెలికాప్టర్ ఎస్పిజీ పర్యవేక్షణలో ఉంటుంది. అందుకే ఆయనకున్న ప్రత్యేక  భద్రత  దృష్ట్యా తనిఖీలను అనుమతించరట. మీరు ప్రయాణించే వాహనాలను మీ అధికార పరిదిలో ఉన్న ప్రాంతంలో తనికీ చేస్తారా? అలాగే దేశం మొత్తం ప్రధాని అధికార పరిధి లోకి వస్తుంది కదా! ఎందుకు మోదీ అంటే మీకు వ్యక్తిగత కక్ష. విభజన ఫలాల గురించి మీరు నాలుగేళ్లు ఏమి చెశారు. గత ఒక సంవత్సరం లోపు నుండే విభజన ఫలాలు గుర్తొచ్చాయా? మీ ప్రతిపక్షంతో పాటు కొందరు రాష్ట్రాభిమానులు ప్రత్యేక హోదా కోసం ఉద్యమం చేసినప్పుడు వాళ్ళ వీపులు పగలగొట్టి జైల్లో కుక్కినప్పుడు మీ తీరు ప్రజలపట్ల అత్యంత దయనీయం కాదా!

 

మీపై, మీ కుటుంబ సభ్యులపై పుష్కరాల సందర్భంగా సినిమా షూట్ చేసేటప్పుడు జరిగిన త్రొక్కిసలాటలో మరణించిన భక్తుల సంఘటనపై విచారణ చేయించారా! నివేదిక ప్రజలకు తెలిపారా? అలాగే దివాకర్ ట్రావెల్స్ బస్ యాక్సిడెంటులో మరణించిన ఇరవైమంది సంఘటనపై విచారణ చేయించి ప్రజలకు నివేదిక బహిరంగ పరచారా? ఇవన్నీ మీ వ్యవస్థల లోపాలు కావా? మీ రాష్ట్రలో బాధితులకు న్యాయం జరగదని కారణం నేరస్తులు దాదాపుగా మీ పార్టీకి చెందిన వారే ఉంటారని జనాంతికం. ఉదాహరణకు చిగురుపాటి జయరాం కేసు చాలదా!    

 

మాహిళా సాధికారత గురించి మాట్లాడే మీరు దాన్ని మీ కోడలు బ్రాహ్మిణికి మీ పార్టీ అధికార ప్రతినిధి సాధినెని యామినికి సాధికారత లభిస్తే చాలనుకున్నారా! మరి మీ రాష్ట్ర ప్రతిపక్ష మహిళా ఎమెల్యే రోజా గాని,  మీ ఎమెల్యే చింతమనేని చేయిజేసుకున్న రెవెన్యూ అధికారిణి వనజాక్షి మహిళలు కాదా?  

 

ఎన్నికల కోడ్ అమలులో ఉన్నా ఐబీతో సహా ఇతర అధికారులతో ప్రధాని నరేంద్ర మోదీ సమీక్షలు నిర్వహిస్తున్నారని కానీ తాను చేస్తే మాత్రం ఎన్నికల కోడ్ అంటూ అడ్డుకోవడం ఎంత వరకు సబబు? అని ప్రశ్నించారు.


ఇక్కడ ప్రధాని విధాన పరమైన నిర్ణయాలు తీసుకుంటే అది తప్పు దేశ భద్రత దృష్ట్యా ఐబీతో మాట్లాడ టం సమీక్షలు జరపటం ప్రధానికి తప్పదు. శాంతి బధ్రతల పరిస్థితి వస్తే మీకూ హక్కు ఉంది కదా! మీకు తెలియదా! అయిన దేశానికి నాయకత్వం వహించే  ప్రధానితో ఒక (చిన్న) రాష్ట్రనికి ప్రాతినిధ్యం వహించే మీకు పోలికలు పోటీ ఎందుకుమీకున్న మానసిక వైకల్యమే కొంత రాష్ట్రానికి తీరని అన్యాయం చేసింది. మీ స్థానంలో పవన్ కళ్యానో? జగన్మోహనరెడ్డో? వివి లక్ష్మినారాయ ణో చివరికి మీ పార్టీలో కాస్త ఇంగిత ఙ్జానం ఉన్న ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నా ఎంతో కొంత ప్రయోజనం రాష్ట్రానికి లభించి ఉండేదని జనం అంటున్నారు.   

 

కేంద్రం విడుదల చేసిన నిధులకు "వినియోగ దృవీకరణ పత్రం" అంటే "ఎండ్ యూజ్ ఆఫ్ ఫండ్స్ఎందుకు మీరివ్వరు? అది మీ భాధ్యత. బాంక్ ఋణమిస్తేనే ఎండ్ యూజ్ ఆఫ్ ఫండ్స్ ధృవీకరించమంటుంది. ఆతరవాతే మరో వాయిదా సొమ్ము విడుదల చేస్తుంది. మీరే మీ నోటి దూల, మీ మద్దతు పత్రికలు కలసి చేసే మోడీ వ్యతిరేఖ ప్రచారాలకు రాష్ట్రంలో చేసే దురాగతాలకు అంతులేదా? మీరు ఎన్నికల నిర్వహణకు మీ రాష్ట్ర ఉద్యోగులను కాకుండా చైతన్య నారాయణ సంస్థల  ఉద్యొగులను, ఆశా వర్కర్లను, అవుట్ సోర్స్ ఉద్యోగులను  అనుభవమూ, శిక్షణ లేని వీరందరిని వినియోగించటంతో వారి అసమర్ధతోనే ఈవీఎంలు పనిచేయక పోవటం జరిగిందని సమాచారం

 

అందరికీ ఆంక్షలు పెడితే తాను కూడా అనుసరిస్తానని కానీ ఆంక్షలు కేవలం ఆంధ్రప్రదేశ్‌కే ఎందుకు వర్తింపజేస్తున్నారని ఈసీపై మండి పడ్డారు. కర్ణాటక, తమిళనాడు లో బీజేపీ మినహా ఇతర పార్టీల నేతలపై ఐటీ దాడులు జరిగాయని అలాంటి చర్యలతో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయోద్దన్నారు. మోదీ కోసం కాకుండా దేశం కోసం పని చేయాలని ఈసీకి సూచించారు. ఈ సార్వత్రిక ఎన్నికల్లో మోదీ ఇంటికి వెళ్లిపోవడం ఖాయమని చంద్రబాబు జోస్యం చెప్పారు. 

 

మోడీ ఇంటికి వెళ్ళటం గురించి మీరు మాట్లాడటం సరికాదు! ఆయన కంటే కొద్ది గంటల ముందే మీరు ఇంటికి  వెళిపోతే? మీరు అపద్ధర్మ ముఖ్యమంత్రి - మీకు మాత్రం విధం గాను అధికారం చెలాయించే చట్టబద్ధ హక్కు గాని అవసరం గాని లేదు-అని న్యాయ నిపుణులే చక్కగా చెపుతున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: