చంద్రబాబు ప్రయోజనం కోసం.. ప్రాపకం కోసం ఏదైనా చేస్తుందని పేరున్న ఓ ప్రముఖ పత్రిక తన తాజా విశ్లేషణాత్మక కథనంలో ఆశ్చర్యకరమైన విశ్లేషణ అందించింది. ఆ కథనం ప్రకారం.. మోడీకీ, చంద్రబాబుకూ చెడటానికి కారణం.. మోడీ నియంతృత్వం కాదు.. చంద్రబాబు ధీరత్వమూ కాదు..


కేవలం గవర్నర్‌ నరసింహన్ మాత్రమేనట. మోడీ, చంద్రబాబు మొదట్లో బాగానే ఉండేవారట. కానీ.. తన పదవి కోసం నరసింహన్ వారి మధ్య గొడవలు పెట్టారట. చంద్రబాబుకు వ్యతిరేకంగా, కేసీఆర్‌కు అనుకూలంగా కేంద్ర ప్రభుత్వ పెద్దలకు గవర్నర్‌ నరసింహన్‌ నివేదికలు ఇస్తూ వచ్చారుట. 

అంతేనా.. ఇంకా ఉంది.. ఎన్నికలు ఎప్పుడు జరిగినా ఏపీలో చంద్రబాబు ఓడిపోతారనీ, జగన్మోహన్‌రెడ్డి అధికారంలోకి వస్తారనీ కేంద్రానికి గవర్నర్‌ సమాచారం చేరవేస్తూ వచ్చారట.. అంటే గవర్నర్‌ కేంద్రానికి ఏం నివేదిక పంపారో కూడా సదరు పత్రికాధిపతికి తెలిసిపోతుందన్నమాట. జగన్మోహన్‌రెడ్డిని బీజేపీ
పెద్దలకు దగ్గర చేయడంలో కూడా గవర్నర్‌ ప్రధాన పాత్ర పోషించారట. 

గవర్నర్ నరసింహన్ విలనిజం.. అక్కడితో ఆగిపోలేదట.. ప్రస్తుత ఎన్నికల తర్వాత కేంద్రంలో అవసరమైతే తెలంగాణ నుంచి కేసీఆర్‌, ఏపీ నుంచి జగన్మోహన్‌రెడ్డి మద్దతు కూడగడతానని బీజేపీ పెద్దల వద్ద గవర్నర్‌ నరసింహన్‌ నమ్మబలికారట. ఇలా నరసింహన్ వ్యవహరించిన కారణంగానే బీజేపీ– తెలుగుదేశం మధ్య తెగదెంపులయ్యాయట. 

మరి ఇదే పత్రిక మోడీ నియంతృత్వ ధోరణిపై పుంఖానుపుంఖాలుగా కథనాలు రాసిందేం.. చంద్రబాబు రాష్ట్రం కోసం మోడీపైనే పోరాడటాన్ని అద్భుతంగా చిత్రించిందేం.. ఇప్పుడు హఠాత్తుగా ఇలా నరసింహన్‌ను విలన్‌ను చేయడం ఎవరి ప్రయోజనం కోసం..? 



మరింత సమాచారం తెలుసుకోండి: