ఎన్నికల పోలింగ్ తర్వాత వివిధ సర్వేల అంచనాలు ఇంకా వెలువడుతూనే ఉన్నాయి. కచ్చితత్వం కోసం కాస్త టైమ్ తీసుకున్నామని చెబుతున్న సంస్థలు కొన్ని ఆలస్యంగా అంచనాలు ప్రకటిస్తున్నాయి. వాటిలో తాజాగా న్యూ ఆంధ్రా పేరుతో ఓ సర్వే వచ్చింది.


ఈ సర్వే ప్రకారం .. ఎంపీ స్థానాల్లో వైసీపీ ప్రభంజనం కనిపిస్తోంది. దాదాపు 18 ఎంపీ స్థానాలు వైసీపీ కచ్చితంగా గెలుచుకుంటుందన్నది ఆ సర్వ అంచనా. టీడీపీ కచ్చితంగా ఐదు ఎంపీ స్థానాలు గెలుచుకోబోతోందట. మరో రెండు ఎంపీ స్థానాల్లో టఫ్ ఫైట్ నడుస్తోంది. 

టీడీపీ కచ్చితంగా గెలిచే అసెంబ్లీ స్థానాలు ఏవంటే... విజయనగరం ఎంపీ స్థానంలో అశోక్‌ గజపతిరాజు మరోసారి ఎంపీగా గెలవడం ఖాయంగా చెబుతున్నారు. అలాగే ఏలూరులో మాగంటి బాబు మరోసారి ఎంపీ గా విజయం సాధించడం పక్కా అట. అలాగే అనంతపురంలో జేసీ పవన్ గెలుపు ఖాయం.. 

మచిలీపట్నంలో కొనకళ్ల నారాయణ మరోసారి ఎంపీ కాబోతున్నారట. చిత్తూరు స్థానాన్ని ప్రత్యేక వేషాల శివప్రసాద్ మరోసారి నిలబెట్టుకుంటారట. ఇవీ కచ్చితంగా టీడీపీ గెలిచే స్థానాలు. వీటికితోడు.. నంద్యాల, కర్నూలులో టఫ్ ఫైట్ నడుస్తోందట.. ఈ స్థానాల్లో వైసీపీకి ఎడ్డ్ ఉన్నా.. పక్కాగా గెలుస్తుందని చెప్పే పరిస్థితి లేదు. ఇదీ న్యూ ఆంధ్రా సర్వే రిపోర్ట్.. 



మరింత సమాచారం తెలుసుకోండి: