లోక్ సభ ఎన్నికలు దేశవ్యాప్తంగా రాజకీయ వేడిని రగిల్చాయి. అయినా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మనసారా నవ్వారు. బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ తో నడుస్తూ, కూర్చొని వివిధ ప్రశ్నలకు జవాబులు ఇచ్చారు. అక్షయ్ కుమార్ తన అధికారికి ట్విట్టర్ హ్యాండిల్ లో ప్రధానమంత్రితో ఇంటర్వ్యూ తీసుకున్నారు.  ఈ ఇంటర్వ్యూలో మోదీ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. రాజకీయాల గురించి మాట్లాడటం తనకు పెద్దగా ఆసక్తి గా ఉండదని.. దానికన్నా ఇతర విషయాల గురించి మాట్లాడటమే తనకు ఇష్టమని చెప్పుకొచ్చారు. 


అక్షయ్ ప్రధానమంత్రిని నేను ఇంట్లో మా అమ్మతో ఉంటాను. మీకెప్పుడూ మీ అమ్మతో ఉండాలని, మీ సోదరులు, మీ బంధువులందరూ మీ ఇంట్లో మీతో ఉండాలని ఉండదా? దీనికి ప్రధాని మోడీ నేను జీవితంలో చాలా చిన్నతనంలోనే వీటన్నిటినీ వదిలేశాను. చాలా చిన్న వయసులో. మా అమ్మ నాతో అనేది.. నువ్వు నా వెనక తిరిగి ఎందుకు సమయం వృథా చేసుకుంటున్నావు? అప్పటి నుంచి నా మనసులో బంధాలపై పెద్దగా వ్యామోహం లేకుండా పోయింది. ది నా జీవితంలో సహజంగా జరిగిపోయింది. నా కుటుంబ నేపథ్యంలో ఇలా దేశం కోసం పనిచేసిన వారు లేరు. ఆర్మీలో చేరి దేశానికి సేవ చేయాలని అనుకున్నానని, అనుకోకుండా రాజకీయాల్లోకి వచ్చానని పేర్కొన్నారు. అనూహ్యంగా పీఎం ని అయ్యానని అన్నారు మోదీ.  


నేను ప్రధాని అయినప్పటికీ నా కుటుంబ సభ్యులు ఎలాంటి మెడికల్, ఇతర ప్రయోజనాలు పొందలేదు.  నేనున్న పదవి వల్ల మా అమ్మ కోసం సమయం కేటాయించలేకపోతున్నాను. నేను నా కుటుంబంతో కలిసి ఉన్నప్పుడు ప్రధానిని అయివుంటే.. వారితో పాటే ఉంటే బాగుండేదని అనుకునేవాడిని. కానీ చిన్న వయసులోనే అన్నీ వదులుకుని వచ్చేశాను. రోజుకు కేవలం నాలుగు గంటలు మాత్రమే నిద్రపోతానని.. అయినప్పటికీ ఎలాంటి ఒత్తిడి లేకుండా పనిచేస్తున్నానని మోదీ చెప్పారు. కానీ రిటైర్ అయ్యాక ఎక్కువసేపు నిద్రపోతానని మోదీ చెప్పుకొచ్చారు. బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ ఆసక్తికర విషయాన్ని తెలిపా 


మరింత సమాచారం తెలుసుకోండి: