సార్వత్రిక ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఒంటరిగా బరిలోకి దిగిన సంగతి తెలిసిందే. అయితే 2014 లో టీడీపీకి పవన్ మద్దతు ఇచ్చి ఓటమిని కొంచెంలో తప్పించాడు. అయితేజనసేన వల్ల తెలుగుదేశం పార్టీకి చాలా చోట్ల దెబ్బ పడుతుందనే లెక్కలకు వచ్చారట తెలుగుదేశం వాళ్లు. జనసేన ప్రభావం కనీసం ముప్పై సీట్లకు పైనే ఉంటుందని కూడా తెలుగుదేశం పార్టీ ఒక అంచనాకు వచ్చినట్టుగా భోగట్టా.


అంటే ఆ నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ ఓటు బ్యాంకును జనసేన చీల్చింది.. అని తెలుగుదేశం వారు తమకు తాము అంచనాకు వచ్చారని సమాచారం. నియోజవకర్గాల వారీగా - ప్రతి బూత్ నుంచి ఓటింగ్ వివరాలను తెప్పించుకుని చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆ సమీక్షలో జనసేన ప్రభావం గురించి ఈ మేరకు అంచనాకు వచ్చారట.గత ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ చంద్రబాబుకు అనుకూలంగా ప్రచారం చేశారు.


సైకిల్ గుర్తుకు ఓటేయమని ప్రచారం చేశారు. దాని ఫలితంగా టీడీపీకి ఎంతో మేలు జరిగింది. ఈ సారి పవన్ పార్టీ సొంతంగా పోటీ చేయడంతో అప్పుడు టీడీపీకి కలిసి వచ్చిన ఓటు బ్యాంకు అంతా పవన్ వెంట వెళ్లిపోయిందిప్పుడు. జనసేన పోటీ చేయడం వల్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు కూడా కొంత వరకూ అటు వైపు మళ్లినా..తెలుగుదేశం పార్టీకి మాత్రం జనసేన వల్ల డబుల్ లాస్ అని విశ్లేషకులు చెబుతూ వచ్చారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: