ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ గ‌వ‌ర్న‌ర్‌గా ప‌నిచేసిన‌ ఎన్డీ తివారి త‌న‌యుడు రోహిత్ తివారి మ‌ర‌ణం విష‌యంలో సంచ‌ల‌న విష‌యాలు వెలుగులోకి వ‌చ్చాయి.  అతని భార్య అపూర్వ హత్య చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది.  తాగిన మైకంలో ఉన్న రోహిత్ ను అపూర్వ అతడి తలపై దిండుతో అదిమి చంపిందని సీనియర్ పోలీస్ అధికారి రాజీవ్ రంజన్ తెలిపారు. పెళ్లైన నాటి నుంచి వారిద్దరి మధ్య విభేదాలు ఉన్నాయని.. ఆ కారణంగానే ఈ నెల 16 న అపూర్వ తన భర్తను ఊపిరాడనివ్వకుండా చేసి చంపిందని ఆయన అన్నారు. రోహిత్ గుండెపోటు  కారణంగా మృతి చెందలేదని ఆయన తెలిపారు.


రోహిత్‌కు, ఆయ‌న‌కు వరసకు వదినైన కుంకుమ్ తో ఉన్న సంబంధంపై మొదటి నుంచి అపూర్వ‌కు అనుమానం ఉండేది. ఏప్రిల్ 15న రోహిత్‌ ఉత్తరాఖండ్ నుంచి తిరిగి వస్తున్నపుడు కుంకుమ్‌తో కలిసి మద్యం సేవించాడు. అపూర్వకు కుంకుమ్, రోహిత్ ల రాత్రి సుమారు 9.30 గంటలకు ఇంటికి రాగానే అపూర్వ ఎవరితో కలిసి మద్యం తాగావని ప్రశ్నించింది. కుంకుమ్ తో అని రోహిత్ సమాధానం ఇవ్వగానే అపూర్వ షాక్‌కు గురైంది. రోహిత్, అపూర్వల మధ్య పెద్ద వాగ్వాదం జరిగింది. రాత్రి సుమారు ఒంటి గంట ప్రాంతంలో అపూర్వ రోహిత్ గదిలోకి వెళ్లి మరోసారి వాదనకు దిగింది. ఇద్దరి మధ్య వాగ్వాదం ముదరడంతో అపూర్వ ఒకచేత్తో రోహిత్ గొంతు పిసుకుతూ రెండో చేత్తో నోరు నొక్కింది. దీంతో రోహిత్ చనిపోయాడు.


అయితే, ఆయ‌న హ‌త్య‌ను ఆత్మ‌హ‌త్య‌గా చిత్రీక‌రించేందుకు అపూర్వ ప్ర‌య‌త్నించింది. రోహిత్ ను హత్య చేసినందువల్ల మర్నాడు అపూర్వ అతని గదిలోకి వెళ్లలేదు. ఆమె 16 ఏప్రిల్ సాయంత్రం 4 గంటలకు పనిమనిషిని రోహిత్ గదిలోకి పంపింది. నౌకరే రోహిత్ ముక్కు, నోట్లో నుంచి రక్తం కారుతోందని, శరీరం చల్లగా అయిందని చెప్పడంతో రోహిత్ ను హాస్పిటల్ కి తరలించినట్టు అపూర్వ శుక్లా డ్రామా ఆడింది.రోహిత్ మేలుకొని ఉండగానే హత్య జరిగిందన్న పోలీసుల అనుమానాలే చివరకు నిజమయ్యాయి. అపూర్వ తాను ఒంటరిగానే ఈ హత్య చేసినట్టు అంగీక‌రించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: