చ‌ంద్రబాబు పాల‌న‌లో  దేవాలయాలకు రక్షణ లేకుండా పోయిందని  వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శించారు. చంద్రబాబు హయంలో మసీదులు, చర్చిలను సైతం కూలగొట్టారని... దేవుడి సొమ్ము అంటే చంద్రబాబుకు భయం లేకుండా పోయింద‌ని ధ్వజ‌మెత్తారు. టీటీడీ బంగారం తరలింపుపై చంద్రబాబు ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. 


ఇదే సమయంలో విజయసాయిరెడ్డి కొన్ని ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు. మీ మనవడికి దేవుడి అంశా అని పేరు పెట్టుకున్నారు... మీ మనవడు మీరు చేసే అన్ని పనులు గమనిస్తున్నారు... మీ కుమారుడికి దొంగతం, మోసం వంటివి నేర్పించారని విజయసాయి అన్నారు. 

రేపు మీ మనవడు మిమ్మల్ని రాష్ట్రానికి ద్రోహం చేశారు అని ఆడిగితే మీరు ఏం సమాధానం చెబుతారని విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు వియ్యంకుడిని టీటీడీ బోర్డు చైర్మన్‌గా నియమించారు. ఉత్తరాదికి చెందిన అనిల్‌కుమార్‌ సింఘాల్‌ను టీటీడీ ఈఓగా నియమించారు.

దొంగతనం, దోపిడీ చేయడానికే చంద్రబాబు ప్రభుత్వం ఇవన్నీ చేసినట్టు స్పష్టంగా తెలుస్తోంది. టీటీడీకి చెందిన బంగారం చెన్నై నుంచి తిరుపతి తరలించేటప్పుడు హైవేపై రాకుండా.. వేపం పట్టు అనే లోపలి రోడ్డు నుంచి ఎందుకు రావాల్సి వచ్చింది? అని ప్రశ్నించారు విజయసాయి. 

గోవిందరాజస్వామి ఆలయంలోని కిరీటాలు చోరీ చేశారు.. ఇద్దరు జేబు దొంగలను పట్టుకుని కిరీటాలు వారే కాజేశారని మభ్యపెడుతున్నారని విజయసాయిరెడ్డి తెలిపారు. వాళ్లు కిరీటాలను కరిగించారని చెబున్నారు. ఏ ఇంటిని సోదా చేస్తే కిరిటీలు దొరుకుతాయో పోలీసులకు తెలుసని వివరించారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: