ఎన్నికల ఫలితాల అంచనాపై ఉత్కంఠ పెరుగుతున్న వేళ మరో కొత్త సర్వే వచ్చింది. న్యూ ఆంధ్రా సర్వే ఫలితాలు వెలువడ్డాయి. చిత్తూరు  జిల్లాలో ఈ ఫలితాలు ఇలా ఉన్నాయి. చిత్తూరు  జిల్లాలో మొత్తం 14 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఈ జిల్లాలో వైసీపీ విజయఢంకా మోగించింది. 


గత అసెంబ్లీ ఎన్నికల్లో ఈ చిత్తూరు  జిల్లాలో వైసీపీ మొత్తం 8 స్థానాలు గెలుచుకుంది.  టీడీపీ  6 స్థానాలు గెలుచుకుంది. తాజాగా ఈ ఎన్నికల్లో న్యూ ఆంధ్రా సర్వే ప్రకారం ఈ జిల్లాలో వైసీపీ జోరు ఇంకాస్త పెరగనుంది. 

చిత్తూరు జిల్లాలో వైసీపీ గతంతో పోలిస్తే మరో రెండు స్థానాలు పెరుగుతాయి. టీడీపీకి  కూడా గతం కంటే మూడు స్థానాలు తగ్గే అవకాశం ఉంది. వైసీపీ 10- టీడీపీ 3 స్థానాలు గెలుచుకోబోతున్నాయట. మరో స్థానంలో టఫ్ ఫైట్ నడుస్తోంది. అక్కడ ఎవరు గెలుస్తారో చెప్పడం కష్టం.  

ఇక చిత్తూరు జిల్లాలో ఇలా ఉంటే.. రాష్ట్రమంతా ఓవరాల్ గా చూస్తే ఈ సర్వే ప్రకారం .. వైసీపీ 101 సీట్లు గెలుచుకుని అధికారం చేజిక్కించుకుంటోందట. అధికార తెలుగుదేశం పార్టీ టీడీపీ 48 స్థానాలు గెలుచుకుంటుందట. ఇక గట్టి పోటీ ఇస్తుందని కలవరపెట్టిన జనసేన ఆరు స్థానాలు మాత్రమే సాధిస్తుందట. మరో 20 స్థానాలు నెక్ టు నెక్ ఫైట్ ఉంటుందని ఈ సర్వే చెబుతోంది.  



మరింత సమాచారం తెలుసుకోండి: