ఏపీ ఎన్నికల పోలింగ్ ముగిసి ఫలితాల కోసం సుదీర్ఘ నిరీక్షణ రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ రేపుతోంది. గెలుపు ఎవరిని వరిస్తుదో తెలియడం కష్టంగా ఉంది. ఈ నేపథ్యంలో పలు సర్వేలు సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నాయి. 


తాజాగా ఇంటలిజెన్స్ పేరుతో ఓ సర్వే కలకలం సృష్టిస్తోంది. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఈ ఫలితాలు ఇలా ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లాలో మొత్తం 10 అసెంబ్లీ సీట్లు, విజయనగరం జిల్లాలో 9 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. 

గత ఎన్నికల్లో శ్రీకాకుళం జిల్లాలో తెలుగుదేశం 7, వైసీపీ 3 స్థానాలు.. విజయనగరం జిల్లాలో టీడీపీ 6, వైసీపీ 3 స్థానాలు గెలుచుకున్నాయి. ఈ సర్వే ప్రకారం.. ఈ రెండు జిల్లాల్లో టీడీపీ- వైసీపీ మధ్య హోరాహోరీ పోరు నెలకొంది. 

శ్రీకాకుళం జిల్లాలో టీడీపీ- 4,  వైసీపీ - 6 స్థానాలు గెలుచుకుంటాయని ఈ సర్వే చెబుతోంది. విజయనగరం జిల్లాలో వైసీపీ ఐదు స్థానాలు, టీడీపీ 4 గెలిచే ఛాన్స్ ఉందట. మరో ప్రధాన పార్టీ జనసేన ఈ రెండు జిల్లాలో మాత్రం ఖాతా తెరిచే ఛాన్స్ లేదట.

ఐతే.. సోషల్ మీడియాలో ఎవరుపడితే వారు సొంత సర్వేలను తప్పుడు పేర్లతో సర్క్యులేట్ చేస్తున్నారన్న వార్తలూ వస్తున్నాయి. కాకపోతే.. ఉత్కంఠతో ఉన్న వారు ఏదో ఒక సమాచారం కోసం అంటూ వీటిని ఫాలో అవుతున్నారు. అసలు విషయం మే 23న కానీ తెలియదు. 


మరింత సమాచారం తెలుసుకోండి: