లగటపాటి రాజగోపాల రెడ్డి తెలంగాణ ఎన్నికల్లో చిలక జోస్యం చెప్పిన సంగతి తెలిసిందే. దీనితో లగటిపాటి మీద సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ట్రోలింగ్ జరిగింది. అయితే మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌ మళ్ళీ జోస్యం చెప్పబోతున్నారు. ఈసారి ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికలకు సంబంధించి. ఆంధ్రప్రదేశ్‌లో అసెంబీ, లోక్‌సభ నియోజకవర్గాలకు ఎన్నికలు జరిగిన విషయం విదితమే. వీటితోపాటు, తెలంగాణకు సంబంధించిన లోక్‌సభ ఎన్నికలు.. అలాగే దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల విషయమై లగడపాటి 'సర్వే ఫలితాలు' వెల్లడిస్తారట. 


అంతా బాగానే వుందిగానీ, లగడపాటి రాజగోపాల్‌ చెప్పే జోస్యాన్ని నమ్మడానికి ఎవరు సిద్ధంగా వున్నారట.? ఆ, ఏముందిలే.. విని కాస్సేపు నవ్వుకుందామని అనుకునేవారూ వుండొచ్చు. అంతలా నవ్వులాట అయిపోయింది మరి లగడపాటి రాజగోపాల్‌ 'జోస్యం.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల కారణంగా. టీఆర్‌ఎస్‌ ఓడిపోతుందనీ, కాంగ్రెస్‌ - టీడీపీ కూటమి గెలుస్తుందనీ లగడపాటి జోస్యం చెప్పిన విషయం విదితమే. స్వతంత్రులు భారీ స్థాయిలో గెలుస్తారని లగడపాటి సెలవిచ్చారు. 


అన్నట్టు, లగడపాటి తెలంగాణలో తన జోస్యం ఎందుకు తప్పిందో కూడా త్వరలోనే వెల్లడిస్తారట. ఇందుకోసం మే 19వ తేదీని ముహూర్తంగా పెట్టుకున్నారు. మే 19వ తేదీన లగడపాటి జోస్యం, మే 23న వాస్తవ ఫలితాలు.. అంటే మధ్యలో ఓ మూడు నాలుగు రోజులు.. జనం హాయిగా నవ్వుకోవచ్చన్నమాట లగడపాటి జోస్యంతో. జనం సంగతేమోగానీ, తెలుగుదేశం పార్టీ అయితే ఆ మూడు నాలుగు రోజులూ అదో రకమైన ఆనందాన్ని పొందడానికి అవకాశం దొరుకుతుంది.  ఎలాగూ, లగడపాటి రాజగోపాల్‌ చెప్పబోయేది తెలుగుదేశం పార్టీ గెలుస్తుందనే. అంతకు మించి ఆయన్నుంచి భిన్నమైన జోస్యాన్ని ఆశించలేం. ఎందుకంటే, ఆయన ఇప్పుడు చంద్రబాబు మనిషి.

మరింత సమాచారం తెలుసుకోండి: