ఫోనీ తుపాను .. తీవ్ర తుపాను నుంచి అతి తీవ్ర తుపానుగా మారింది. మచిలీపట్నం తీరం నుంచి 757 కిలోమీటర్ల దూరంలో కేంద్రీ కృతమై ఉంది. ప్రస్తుతం ఆగ్నేయ దిశగా వేగంగా ఈ తుపాన్ వేగంగా పయనిస్తోంది.
ఫోనీ ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా మారింది. జాలర్లు ఎవరూ చేపల వేటకు వెళ్లరాదు.. ప్రజలెవ్వరూ కూడా తీర ప్రాంతాలకు వెళ్లరాదని ఏపీ ఆర్టీజీఎస్ హెచ్చరించింది. అయితే ఈ తుపాను ప్రభావం ఆంధ్రప్రదేశ్ పై తక్కువగానే ఉంటుందని ఆర్టీజీఎస్ అంచనా వేసింది.
ఫోనీ తుపాను కారణంగా శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తుపాన్ ప్రభావం వల్ల 2, 3వ తేదీల్లో ఉత్తరాంధ్రలో గాలుల ప్రభావం ఉంటుంది. గంటకు 50 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో వీచే సూచనలు ఉన్నాయి.
తుపాన్ గమనాన్ని నిశితంగా పరిశీలిస్తున్న రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ.. ఎప్పటికప్పుడు యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తోంది. ఈ తుపాను ఓడిశాలోని పూరీ సమీపంలో తీరం దాటవచ్చని అంచనా వేస్తున్నారు.