ఏపీలో ప్రీ పోల్ సర్వేల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హవా ఉంటుందనే విషయం తేటతెల్లం అయ్యింది. అనేక జాతీయ మీడియా వర్గాల సర్వేలు అదే మాటే చెప్పాయి. ఎన్నికల నియామవళి ప్రకారం ఒక పోస్ట్ పోల్ సర్వేలు ఎగ్జిట్ పోల్స్ గట్రా ఇప్పుడే విడుదల కావడానికి లేదు.  అయితే ఇప్పటికే ఎగ్జిట్ పోల్స్ గట్రా చేయించుకున్న మీడియా వర్గాలు మాత్రం వాటిని రాజకీయ నేతల వరకూ  చేరవేస్తున్నట్టుగా తెలుస్తోంది.


అందులో భాగంగా తెలుగుదేశం పార్టీకి బాగా అనుకూలంగా వ్యవహరించిన ఒక ప్రముఖ వార్తా చానల్ కూడా తమ సర్వేను నేతలకు చేరవేస్తున్నట్టుగా సమాచారం. దాని లెక్కలు ఆసక్తిదాయకంగా ఉన్నాయి.వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి 98 నుంచి 102 సీట్ల వరకూ రావొచ్చని ఆ మీడియా వర్గం అంచనా వేస్తోందట. సదరు మీడియా వర్గం ఇది వరకూ పక్కా తెలుగుదేశం పార్టీనే. అయితే ఈ మధ్య దాని తీరులో కొంత మార్పు కనిపిస్తూ ఉంది. ఆ మార్పు ఫలితాల గురించి ముందస్తు ఊహాగానాలతోనే అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.


ఫలితాలు ఎలాగూ జగన్ కు అనుకూలంగా ఉంటాయనే అంచనాలతో.. ఆయనను ముందుగానే ఇంప్రెస్ చేయడానికి సదరు చానల్ తమ ఎగ్జిట్ పోల్ ఫలితాలను జగన్ కు పంపించినట్టుగా తెలుస్తోంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి దక్కే సీట్ల నంబర్ తో పాటు.. ఏయే సీట్లలో వైఎస్సార్సీపీ హవా ఉంటుందనే అంశం గురించి కూడా జగన్ కు వారు పూర్తి జాబితాను అందించినట్టుగా సమాచారం!

మరింత సమాచారం తెలుసుకోండి: