సమాజంలో రోజురోజుకు వికృత పోకడలు ఎక్కువ అవుతున్నాయి. పెరిగిపోతోన్న టెక్నాలజీ వల్ల సమాజంలో మంచితో పాటు చెడు కూడా ఎక్కువే జరుగుతోంది. ఈ క్రమంలోనే వీటి వల్ల మనుష్యుల ఆలోచనల్లో పెడమార్పులు వస్తున్నాయి. ఇటీవల ఇండియాలో వైఫ్ స్వాపింగ్ ఎక్కువ అవుతోంది. ఈ వైఫ్ స్వాపింగ్లో ఒకరికొకరు లైంగీక ఆనందం కోసం భార్యలను మార్చుకుని శృంగారం చేస్తారు. తాజాగా కేరళలో వెలుగులోకి వచ్చిన ఈ కేసులో లైంగికానందం కోసం భార్యలను మార్చుకుంటున్న నలుగురు వ్యక్తులను కేరళ పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదుతో స్పందించిన పోలీసులు అలప్పుజ జిల్లాలోని కయంకుళం పట్టణంలో ఈ తంతు వెలుగులోకి వచ్చింది.
పరాయి వ్యక్తితో శృంగారంలో పాల్గొనాలని భర్త ఒత్తిడి చేయడంతో విసిగిపోయిన బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో ఈ చీకటి బాగోతం వెలుగులోకి వచ్చింది. కొంత కాలంగా సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న ఈ వ్యవహారం రట్టు కావడంతో కేరళలో కలకలం రేగింది. అసలు వివరాల్లోకి వెళితే కేరళలో గతేడాది మార్చిలో వైఫ్ స్వాపింగ్ స్టార్ట్ అయ్యింది. భర్త తన అవసరాల కోసం భార్యను పరాయి పురుషులతో శృంగారం చేయాలని ఒత్తిడి చేయడంతో ఆమె కొద్ది రోజులుగా అలాగే చేస్తూ వచ్చింది.ఇక లేటెస్ట్గా సోషల్ మీడియా యాప్ షేర్ చాట్లో బాధితురాలి భర్తకు కాలికట్కు చెందిన అర్షద్ పరిచయం అయ్యాడు. అప్పటి నుంచి అతడితో ఏకాంతంగా గడపాలని భర్త వేధిస్తూ వస్తున్నాడు. చివరకు పోలీసులు బాధితురాలి ద్వారా అర్షద్ను ఎక్కడ కలవాలో ట్రాప్ చేయించి పట్టుకున్నారు.
బాధితురాలి భర్తతో పాటు నలుగురిని అరెస్ట్ చేసి, ఐపీసీ 366 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. ఇక కేరళలో కొద్ది రోజులుగా సోషల్ మీడియా వల్ల ఈ వైఫ్ స్వాపింగ్ విస్తృతంగా వ్యాపిస్తోంది. పలువురు ఇలాగే చేస్తున్నట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది. కృష్ణాపురంకు చెందిన కిరణ్, వవక్కవుకు చెందిన సీది, కేరళపురంకు చెందిన ఉమేష్, తిరువళ్లకు చెందిన బ్లెసరిన్ పయిప్పాడ్లను పోలీసులు అరెస్టు చేశారు. ఈ నలుగురు తమ భార్యలను ఒకరితో ఒకరు మార్చుకుని శృంగారంలో పాల్గొనేవారని పోలీసులు తెలిపారు.