తెలంగాణలో సంచలనం సృస్టించిన హాజీపూర్ వరుస హత్యల మిస్టరీని పోలీసులు ఛేదించారు.  యాదాద్రి భువనగిరి జిల్లా హాజీపూర్ గ్రామానికి చెందిన మర్రి శ్రీనివాస్ రెడ్డే ఈ దారుణాలకు పాల్పడినట్టు గుర్తించారు.  గత వారం రోజుల క్రితం శ్రావణి అనే పదవతరగతి అమ్మాయి చనిపోయి బావిలో శవం కనిపించడంతో పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు కొనసాగించారు. 

ఈ నేపథ్యంలో శ్రావణిని ఓ యువకుడు తన బైక్ పై తీసుకు వెళ్లడం సిసీ కెమెరాలో గమనించి అతని గురించి ఎంక్వేయిరీ అరంభించగా అతను మర్రి శ్రీనివాస్ రెడ్డి గా గుర్తించారు. ఈ కోణంలో అతనిని అదుపులోకి తీసుకొని పూర్తి వివరాలు సేకరించడంతో భయంకరమైన నిజాలు వెలుగు లోకి వచ్చాయి.  హాజీపూర్ లో నాలుగేళ్ల క్రితం కనిపించకుండా పోయిన కల్పన, ఈ మద్య శ్రావణి, నెల రోజుల క్రితం మనీషా ఇలా వరుసగా దారుణంగా వారిపై అత్యాచారం చేసి చంపేశాడని పోలీసులు నిర్ధారించారు.

  తాజాగా రాచకొండ పోలీసులు ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ మీడియా సమావేశంలో రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ వివరాలు తెలిపారు. శ్రీనివాస్ రెడ్డిది మొదటి నుంచి ఉన్మాద స్వభావం అని వెల్లడించారు. శ్రీనివాస్ రెడ్డి లిఫ్ట్ మెకానిక్ గా పనిచేస్తుంటాడని చెప్పారు. గతంలో కర్నూలులో స్నేహితులతో కలిసి వేశ్యను రూమ్ కి తీసుకువచ్చి, ఆపై ఆమె డబ్బుల కోసం గొడవపడితే చంపేశాడని వివరించారు. ఆ వేశ్య మృతదేహాన్ని అపార్ట్ మెంట్ పైభాగంలో ఉన్న నీళ్లులేని వాటర్ ట్యాంక్ లో వేశారని మహేశ్ భగవత్ వెల్లడించారు. 

అయితే శ్రీనివాస్ రెడ్డి ఉన్మాదిగా మారడానికి..ఆ ఊరి అమ్మాయిలనే దారుణంగా చంపడానికి ఓ కారణం ఉందట. గతంలో శ్రీనివాస్ రెడ్డిని టీజింగ్ కేసులో ఊరివారే ఓ చెట్టుకు కట్టేసి కొట్టి అవమానించారని..ఇదే కక్ష్యమనసులో పెట్టుకొని ఆ ఊరి అమ్మాయిలను దారుణంగా అత్యాచారం చేసి  బావిలో పూడ్చిపెట్టేవాడని వివరించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: