ప్రధాని నరేంద్ర మోదీ కుటుంబంలో విసాదం నెలకొంది. మోదీ సోదరుడు ప్రహ్లాద్మోదీ భార్య భగవతి బుధవారం కన్నుమూశారు. ప్రహ్లాద్ మోదీ భార్య భగవతి అనారోగ్యంతో బాధపడుతున్నారు. దీంతో ఆమెను అహ్మదాబాద్లోని సివిల్ ఆస్పత్రిలో చేర్పించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె ఉదయం తుదిశ్వాస విడిచారు. అనంతరం భగవతి మృతదేహాన్ని అహ్మదాబాద్లోని వారి నివాసానికి తరలించారు. భగవతి అంత్యక్రియలు అహ్మదాబాద్లోని తల్తేజ్లో జరగనున్నాయి.